ఆంధ్రప్రదేశ్
మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలి – జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
కర్నూలు, అక్టోబర్ 24: మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరంగా,నాణ్యతతో మధ్యాహ్న భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఉపాధ్యాయులను ఆదేశించారు..
గురువారం గోనెగండ్ల మండలం కుర్నూరు గ్రామంలో గ్రామ సచివాలయం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు..
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం తయారు చేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు..అన్నం రుచి చూసి, మరింత ఉడికించాలని కలెక్టర్ వంట సిబ్బందికి సూచించారు.. మెనూ ప్రకారమే విద్యార్థులకు భోజనం అందజేస్తున్నారా? లేదా? ఈ రోజు మెనూ ప్రకారం ఏం చేశారని కలెక్టర్ వంట సిబ్బందిని ఆరా తీశారు..సాంబారు అన్నం, గుడ్డు చేశామని వారు సమాధానమిచ్చారు..
అనంతరం తరగతి గదులను పరిశీలించారు.. 10వ తరగతిలో విద్యార్థుల సంఖ్య ఎందుకు ఇంత తక్కువగా ఉందని కలెక్టర్ ప్రధానోపాధ్యాయుడిని ప్రశ్నించారు.. డ్రాపౌట్ అయ్యారని, అందుకే పాఠశాలకు రాలేదని హెడ్మాస్టర్ తెలిపారు.. డ్రాపౌట్ అయిన విద్యార్థులను మోటివేట్ చేసి పాఠశాలకు తీసుకుని రావాలని కలెక్టర్ ప్రధాన ఉపాధ్యాయుడిని ఆదేశించారు.. ఆర్వో ప్లాంట్ ను సంబంధిత ఏజెన్సీ లతో త్వరితగతిన మరమ్మతు చేయించాలని కలెక్టర్ ప్రధాన ఉపాధ్యాయుడిని అదేశించారు. అదే విధంగా పాఠశాలలోని ఆర్ఓ ప్లాంట్, బోర్ వెల్స్ నీటి పరీక్షలను చేయించాలని కలెక్టర్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు..
*గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్*
కుర్నూరు గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు.. గ్రామ సచివాలయం ద్వారా మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.. అటెండెన్స్ రిజిస్టర్, మూవ్మెంట్ రిజిస్టర్ లను పరిశీలిస్తూ, ఎవరెవరు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారని వివరాలను సచివాలయం సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.. గ్రీవెన్స్ రిజిస్టర్ ను పరిశీలిస్తూ ప్రతి రోజూ ఎక్కువగా ఎలాంటి సర్వీస్ కావాలని అప్లికేషన్ లు వస్తున్నాయి అని కలెక్టర్ డిజిటల్ అసిస్టెంట్ ను ఆరా తీశారు?? కాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ ల కొరకు దరఖాస్తులు ఎక్కువగా వస్తాయని డిజిటల్ అసిస్టెంట్ కలెక్టర్ కి వివరించారు..నిర్దేశిత గడువులోపు ప్రజలకు సేవలు అందించాలని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు.
కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, గోనెగండ్ల ఎమ్మార్వో కుమారస్వామి, ఎంపీడీవో మణి మంజరి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు..
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక