ఆంధ్రప్రదేశ్
ప్రధానమంత్రి ఇంటర్నె్ షిప్ పథకమును యువత సద్వినియోగం చేసుకోవాలి: వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ చైన్

ప్రధానమంత్రి ఇంటర్నె్ షిప్ పథకమును యువత సద్వినియోగం చేసుకోవాలి: వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ చైన్
వికారాబాద్ జిల్లా/ పరిగి (ఏపీ టుడే న్యూస్): ఫిబ్రవరి 26 :
ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ పథకమును యువత సద్విని చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ తెలిపారు.
భారత ప్రభుత్వం, కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు అందించే ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ పథకము రెండవ దశ ప్రారంభమైందని, ఈ రెండవ దశ దరఖాస్తు ప్రక్రియ మార్చి 11 వరకు కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు.
ఈ పథకంలోని ముఖ్యాంశాలు ఈ ఇంటర్న్ షిప్ కి ఎంపికైన విద్యార్థులకు నెలవారి భత్యం 5000 రూపాయలు ఒకేసారి 6000 మంజూరు చేయబడతాయని , 12 నెలల ఇంటర్న్ షిప్ కాలవ్యవధిలో కనీసం 6 నెలలు ఉద్యోగ శిక్షణ ఉంటుందని తెలిపా. ఇంటర్న్ షిప్ ద్వారా వాస్తవ ప్రపంచ అనుభవాన్ని పొందగలుగుతారని, ఉపాధి అవకాశాలను మెరుగు పరచుకుంటారని అన్నారు. ఇప్పటికే దాదాపు 3 లక్షలకు పైగా దరఖాస్తులు సమర్పించబడ్డాయని అన్నారు.
ఇంటర్న్ షిప్ పథకానికి 21 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారై ఉండాలని , కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు తెలిపారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, పాలిటెక్నిక్ డిప్లమా, డిగ్రీ పూర్తయి ఉండాలని ఆయన తెలిపారు. గత సంవత్సర కుటుంబ ఆదాయం 8 లక్షల లోపు కలిగి ఉండాలని అన్నారు.
pminternship,mca.gov.in పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. తమ ఆసక్తులు ఆధారంగా వివిధ రంగాలలో అవకాశాలను గరిష్టంగా 5 ఇంటర్న్షిప్లను ఎంచుకోవాలన్నారు. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మీ దరఖాస్తులను సమర్పించవలసిందిగా కలెక్టర్ సూచించారు. యువత నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి మరియు వారి భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడానికి ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కలెక్టర్ సూచించారు.
అందరం కలిసి, ప్రచారం చేద్దాం మన యువత భవిష్యత్తును తీర్చిదిద్దడంలో సహాయం చేద్దాం అని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఏదేని సమాచారం కోసం 1800 116090 (టోల్-ఫ్రీ) ని సంప్రదించండి లేదా pminternship.mca.gov.in ని సందర్శించాలని కలెక్టర్ సూచించారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక