ఆంధ్రప్రదేశ్
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి

కడప జిల్లా/జమ్మలమడుగు ఏపీ టుడే న్యూస్ మార్చి 27:
జమ్మలమడుగు మున్సిపాలిటీ సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దడమే తమ లక్ష్యం అని, ఈ మేరకు పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, నూతన నిర్మాణాలు చేపట్టి పట్టణం అభివృద్ధి చేస్తామని రాష్ట్ర విప్, శాసనసభ్యులు చదిపిరాళ్ళ ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మరియు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి ల సహకారంతో దాదాపు రూ.18 లక్షల వ్యయం వెచ్చించి పాత బస్టాండ్ కూడలిలో నూతనంగా నిర్మించిన సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాల సముదాయాన్ని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టిడిపి ఇన్చార్జి భూపేష్ రెడ్డి, ఎన్డీఏ కూటమి నాయకులు గోనా పురుషోత్తం రెడ్డి, జామియా మసీదు పీఠాధిపతి సయ్యద్ షా సాదిక్ పాషా ఖాద్రీ లతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దుకాణాలను ప్రారంభించారు. అంతకు ముందు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి మరియు టిడిపి ఇన్చార్జ్ భూపేష్ రెడ్డి, నాయకులను నూతన దుకాణాల యజమానులు కాశ్మీర్ శాలువాలు పూలదండ లతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది మాట్లాడుతూ జమ్మలమడుగు పట్టణంలో వందల సంవత్సరాల నుంచి చాలా దుకాణాలు ఉన్నాయని, వాటి స్థానంలో కొత్తగా నిర్మాణాలు చేపట్టి జమ్మలమడుగు మున్సిపాలిటీని అందంగా తీర్చిదిద్దుతామని అలాగే ప్రజలకు ట్రాఫిక్ సమస్య లేకుండా రోడ్లు కూడా విస్తరించి నాలుగు రోడ్లు రహదారి ఏర్పాటు చేస్తామని దీని వల్ల ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా ఉంటుందని తెలిపారు. దుకాణదారులు కూడా నూతన దుకాణాలతో వాహన దారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకే విధంగా తమ వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. టిడిపి ఇన్చార్జ్ భూపేష్ రెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని, ప్రజలకు, చిరు వ్యాపారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రుణాలు మంజూరు చేసి వ్యాపారాలు చేసుకుని అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, అర్బన్ సీఐ లింగప్ప, సిఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణ సముదాయాల ఇన్చార్జ్ వైకే కిరణ్, ఎన్డీఏ కూటమి నాయకులు, టిడిపి, బిజెపి నాయకులు, ముస్లిం మైనార్టీ నాయకులు, పూల దుకాణాల యజమానులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక
-
ఆంధ్రప్రదేశ్2 months ago
స్పందన సుబ్బరామిరెడ్డి ఇకలేరు…