Uncategorized
ఫోన్ పే ద్వారా లంచం చెల్లింపు.. అడ్డంగా బుక్కైన తహసీల్దార్ ?

అనంతపురం జిల్లా వజ్రకరూరు తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడుల చేశారు.
ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా అవినీతి అధికారులు మాత్రం మారడం లేదు. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ ప్రజలకు పని చేయాలంటే బల్లకింద చేతులు చాపుతున్నారు. ఎన్ని హెచ్చరికలు చేసినా బుద్ధి మారడంలేదు. తాజాగా ఓ అవినీతి అధికారి ఏసీబీ వలకి చిక్కారు. పక్కా సమాచారంతో అనంతపురం జిల్లా వజ్రకరూరు తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడుల చేశారు. రైతు నుంచి లంచం తీసుకుంటున్న తహసీల్దార్ మహమ్మద్ రఫీని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. భూమిని మ్యుటేషన్ కోసం ఎమ్మార్వో రఫీని నంద్యాల చెందిన రైతు కలిశారు. దీంతో 65 వేలు లంచం ఇస్తే పని చేస్తానని తహసీల్దార్ డిమాండ్ చేశారు. అంత లంచం ఇచ్చుకోలేని రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అధికారులు చెప్పినట్టుగా ఎమ్మార్వో రఫీకి లంచం డబ్బులను ఫోన్ పే ద్వారా పంపారు. వెంటనే రంగంలోకి ఏసీబీ అధికారులు ఎమ్మార్వో కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. Md రఫీని అదుపులోకి తీసుకుని విచారించారు. లంచం నిర్ధారణ కావడంతో శాఖా పర్యమైన చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు జారీ చేసారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక