ఆంధ్రప్రదేశ్
ఇస్కాన్ సంస్థ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్.
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ
కర్నూలు నగరంలోని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్ )ఆలయంలో జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం ,ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని ఇస్కాన్ టెంపుల్ లో జగన్నాథ బలదేవ సుభద్రమాయిలకు ఆయన ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు .అనంతరం ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ని సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ కర్నూల్ నగరంలో ఇస్కాన్ సంస్థ అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ,రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సహకారం అందిస్తున్నారని తెలియజేశారు. శ్రీకృష్ణ తత్వాన్ని ఇస్కాన్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తుందని వివరించారు.. కర్నూలు నగరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నామని వివరించారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీ.జీ. వెంకటేష్ కుటుంబానికి శ్రీకృష్ణ పరమాత్ముని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ,వారు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68093