Connect with us

ఆంధ్రప్రదేశ్

దళితులు, పేదల భూములు కబ్జా చేసిన వైసీపీ నేతలు

Published

on

ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ

* దళితులు, పేదల భూములు కబ్జా చేసిన వైసీపీ
• గ్రీవెన్స్ లో నేతల ముందు లబోదిబోమంటూ న్యాయం కోసం వేడుకున్న అర్జీదారులు*
• న్యాయం చేస్తామంటూ బాధితులకు నేతల హామీ*

గత అరాచక పాలన వలన అంధకారంలో ఉన్న రాష్ట్రంలో వెలుగులు నింపడమే లక్ష్యంగా… ప్రజాసేవే పరామావధిగా.. ప్రజల సమస్యలు తీర్చడమే ధ్యేయంగా.. ప్రజా బంధువు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన వెంటనే అడుగులు వేయగా.. అధినేత సంకల్పానికి తోడై మంత్రులు నేతలం ముందుకు సాగుతున్నామని. ప్రజా సమస్యలు తీర్చే దేవాలయంగా టీడీపీ కేంద్ర కార్యాలయం మారిందని. గత రాక్షస పాలనలో అన్యాయానికి గురై.. అనేక ఇబ్బందులు పడి.. నాడు దాచుకున్న కన్నీళ్ల సుడులతో గుండెల నిండా వ్యథతో తమ గోడు చెప్పుకుని న్యాయం పొందడానికి అర్జీదారులు నేడు గ్రీవెన్స్ కార్యక్రమానికి పోటెత్తారని.. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యలయంలో అర్జీలు స్వీకరించిన మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్సీ అశోక్ బాబు, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ముస్తాక్ అహ్మద్ అన్నారు. అర్జీదారులు నుండి వినతులు స్వీకరించి.. సంబంధిత అర్జీలపై అధికారులకు ఫోన్లు చేసి సమస్యలను వివరించి పరిష్కరించేందుకు కృషి చేశామన్నారు. పరిశీలించి పరిష్కరించాల్సిన అర్జీలను ఆయాశాఖలకు పంపి పరిష్కారానికి ఆదేశించామన్నారు. గత ప్రభుత్వం ప్రజల సమస్యలను ఏనాడు పట్టించుకోలేదని.. నాటి పాలకులు ప్రజలపై దెయ్యాల్లా పడి పీడించారని.. ప్రజల రక్తం తాగి ప్రశ్నిస్తే వారి ప్రాణాలు తీశారని నేతలు విమర్శించారు. నేడు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏ చిన్న సమస్య ఉన్నా తమ సమస్యకు పరిష్కారం దొరకుతుందన్న నమ్మకంతో ప్రజలు కూటమి నేతల వద్దకు క్యూ కడుతున్నారన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించి వారి ముఖాల్లో ఆనందం చిరునువ్వులు చూడటమే తమ ధ్యేయమన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో పలువురికి ఆర్థిక సాయం నిమిత్తం చెక్కులు అందించారు.

• 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 1986 లో ప్రభుత్వం ఇచ్చిన భూములు దాదాపు 430 ఎకరాలను ఆ పార్టీ నేతలు కబ్జా చేశారని శ్రీ సత్యసాయి జిల్లా పెనుంగొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం పోలే పల్లి గ్రామానికి చెందిన బాధితులు అంజినప్ప, మారెప్ప, సాదరి గొవిందప్ప, యలవ నారాయణప్ప ఆదేమ్మ, బుడ్డయ్యలు నేడు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. కబ్జాదారుల నుండి తమ భూములను విడిపించాలని నేతలను వేడుకున్నారు.
• హిందూపురం మండలం జంగాలపల్లికి చెందిన అలివేలమ్మ, చిన్నతిమ్మరాయప్ప, అశ్వర్థప్పలు నేడు గ్రీవెన్స్ లో నేతలకు అర్జీని ఇస్తూ.. వైసీపీ నేత నరసింహులు తమ భూములను కాజేయాలని తమకు మంజూరైన 1Bలను రద్దుచేయించి పొలంలోకి వెళితే తమను కొట్టిస్తున్నాడని.. అతనికి పోలీసులు సహకరిస్తున్నారని తమకు న్యాయం చేయాలని బాధితులు నేడు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు.
• తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీకి చెందిన బి.గీత, పి. జయమ్మ, చెంచులక్ష్మి, జయలక్ష్మి లు విజ్ఞప్తి చేస్తూ.. తమ ఇళ్లు నేషనల్ హైవే రోడ్డు నిర్మాణంలో పోతున్నవని.. దానికి సంబంధించిన పరిహారం ఇవ్వడానికి వైసీపీ నేతలతో రేణిగుంట రెవెన్యూ అధికారి కోటేశ్వరరావు కుమ్మక్కై లంచం డిమాండ్ చేశారని.. తాము ఇవ్వలేమని చెప్పడంతో.. తమకు రావాల్సిన పరిహారాన్ని తగ్గించేశాడని.. తమ పక్కన ఉన్న వైసీపీ నేతలకు చెందిన రేకుల షేడ్ కు మాత్రం రూ. 18,00,000 లక్షలు కొంత మందరికి 40 లక్షల నుండి 60 లక్షల వరకు ఇంటికి మంజూరు చేయించాడని.. తమకు న్యాయం చేయాలని వారు నేడు గ్రీవెన్స్ లో వేడుకున్నారు.
• అనంతపురం జిల్లా పుట్లూరు మండలం నారయణపల్లె గ్రామానికి చెందిన పొత్తూరి రవికుమార్ విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామం గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని.. తమ గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని.. గ్రామానికి ఇంత వరకు రోడ్డు లేదని.. దయచేసి తమ గ్రామానికి రోడ్డు వేయాలని రవికుమార్ నేడు నేతలకు వినతి పత్రం ఇచ్చాడు.
• తాను తన మద్దతు దారులు టీడీపీలో చేరడంతో టాంజానియాకు వెళ్లిన తనకొడుకుపై అక్కడకు పంపిన ఏజెంట్ వైసీపీ సానుకూలపరుడు కావడంతో అక్కడ అక్రమ కేసులు పెట్టించాడని.. తన కుమారుడిని తిరిగి ఇండియాకు రప్పించాలని సత్యసాయి జిల్లా ఓబులదేవర చెరువు మండలం తంగేడు కుంట గ్రామాని చెందిన సోమశేకర్ రెడ్డి నేడు గ్రీవెన్స్ లో వేడుకున్నాడు
• గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం తాడేపల్లికి చెందిన జూటూరు మంగమ్మ విజ్ఞప్తి చేస్తూ.. తాను పేదరాలునని తనకు యాక్సిడెంట్ లో కాలు చేయి విరిగాయని ఎటువంటి పనులు చేసుకోలేనని. తనకు పింఛన్ పెట్టించవలసిందిగా ఆమె నేడు గ్రీవెన్స్ లో అర్థించారు
• కడప జిల్లా పోరుమామిళ్ల మండలం సిద్దనకిచామపల్లెలో ఎంపీపీ స్కూల్ నందు పనిచేస్తోన్న హెడ్ మాస్టర్ వైసీపీ నేతలకు అనుకూలంగా పనిచేస్తూ.. బడిపిల్లలను ఇబ్బంది పెడుతున్నాడని దాన్ని ఎంఈవో దృష్టికి తీసుకెళ్లామని.. అతనిపై చర్యలు తీసుకోవాలని నేడు ఆగ్రామానికి చెందిన నారాయణ, రోశయ్యలు గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేశారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580263
Total Users : 47947