ఆంధ్రప్రదేశ్
వరదల్లో నష్టపోయిన ప్రజలను రైతులను ఆదుకోవాలి :-సిపిఎం

కర్నూలు :
గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి నీరు చేరి నష్టపోయిన ప్రజలను, పంట పొలాలు మునిగిపోయి బాధపడుతున్న,నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయం నందు జిల్లా విస్తృత సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ విస్తృత సమావేశానికి నంద్యాల జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి యేసురత్నం అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ నాగరాజు, ఎం నాగేశ్వరరావు లతోపాటు జిల్లా లోని పట్టణ, మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అనంతరం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్ లు రాష్ట్రంలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలంతా తీవ్రంగా నష్టపోయారని, వారిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, ఇప్పటికే పంటలు వేసుకుని నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో నష్టపోయిన రైతాంగాన్ని , ప్రజలను ఆదుకునేందుకు విపత్తుల సహాయం కింద నిధులను విడుదల చేయాలని అన్నారు. అదేవిధంగా నంద్యాల జిల్లాలోని చామకాలువ, కుందునది, మద్దిలేరు వాగు, తెలుగుగంగ, కెసి కెనాల్ లు నిండిపోయి వాటి ద్వారా నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలని ,భవిష్యత్తులో వరదల నుండి నష్టపోకుండా ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని అన్నారు. వరదలు వచ్చిన ప్రతిసారి నంద్యాల పట్టణమంతా పూర్తిగా నిండిపోయి ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుండి చామకాలువ, కుందునది , మద్దిలేరువాగుల వెంట రక్షణ గోడను నిర్మించాలని, గతంలో నిధులను కేటాయిస్తే వాటిని ఉపయోగించడంలో ప్రజాప్రతినిధులు ఘోరంగా విఫలమయ్యారని, దానివల్లే నేడు ప్రజలు వరదలు వచ్చిన ప్రతిసారి తీవ్రంగా నష్టపోవడం జరుగుతుందని అన్నారు. చిన్నపాటి వర్షానికి నంద్యాల పట్టణం అంతా బురదమయంగా మారుతుందని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అన్నారు. అదేవిధంగా ఎక్కడైతే ప్రజల ఇబ్బందులు పడుతున్నారో వారిని సిపిఎం కార్యకర్తలు ప్రజాసంఘాల నాయకులు సహాయం చేయాలని అధికారులను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఉండాలని ప్రజలకు సాయం అందించడంలో కీలక పాత్ర పోషించాలని అన్నారు. ముఖ్యంగా రాబోయే నెల రోజుల్లో జిల్లాలోని పార్టీ కార్యకర్తలు అంతా పార్టీ శాఖల సమావేశాలు నిర్వహించి మహాసభలు జరపాలని వాటి జయప్రదం కోసం కృషి చేయాలని, గత మూడు సంవత్సరాల కాలంలో చేసిన పోరాటాలను వివరిస్తూనే జరిగిన పొరపాట్లను , మిగిలిపోయిన కార్యక్రమాలను పూర్తి చేయడం కోసం భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని ,పార్టీ అభివృద్ధికి బాటలు వేసుకునే విధంగా ప్రతి కార్యకర్త ప్రణాళికలను రూపొందించుకోవాలని గ్రామస్థాయి నుండి పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారం కృషి చేయాలని అన్నారు*
*అభివందనములతో దర్శనం లక్ష్మణ్ సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు నంద్యాల*
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక