ఆంధ్రప్రదేశ్
విశేష పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ దంపతులు శ్రీమతి రాజకుమారి గణియా శ్రీహరి.

సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
ఏపీ టుడే న్యూస్
నంద్యాల జిల్లా బ్యూరో.
కలెక్టరేట్లో పరిపాలన గణనాథుని వేడుకలు.
వినాయకుడి ఆశీర్వాదములతో జిల్లా అభివృద్ధి పథంలో నడవాలి.
విశేష పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ దంపతులు శ్రీమతి రాజకుమారి గణియా శ్రీహరి.
వినాయక చవితి పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని శనివారం కలెక్టరేట్లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో గణేశ చతుర్థి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, శ్రీహరి దంపతులు పాల్గొని పరిపాలన గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి పండితుల ఆశీర్వాదాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ సర్వ విజ్ఞాలను అధిగమించి జయమును కలిగించే వినాయకుడి ఆశీర్వాదములతో జిల్లా అభివృద్ధి పథంలో నడవాలని కోరుకున్నట్లు తెలిపారు. బుద్ధి-సిద్ధినిచ్చి, దుఃఖాన్ని నివారించి, సంతోషాన్ని కలిగించే గణేశుడు జిల్లా ప్రజలకు, వారి కుటుంబ సభ్యులకు విద్యాబుద్ధులు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎ. పద్మజ, కలెక్టరేట్ ఏఓ రవి, అన్ని సెక్షన్ల సూపరింటెండెంట్లు రెవిన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక