Connect with us

ఆంధ్రప్రదేశ్

టెర్రరిస్టు పాలనను తలపించేలా అయిదేళ్ల వైసిపి పాలన : మంత్రివర్యులు ఎన్ఎండి ఫరుక్.

Published

on

సయ్యద్. ఇక్బాల్ హుస్సేన్ నంద్యాల జిల్లా బ్యూరో.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.

చంద్రబాబును అక్రమ అరెస్టుకు ఏడాది.
చంద్రబాబు అభివృద్ధి , సంక్షేమం , సామాజిక న్యాయం ధ్యేయంగా పాలన చేశారని నీతి , నిజాయితీ , చట్టబద్ధత , పారదర్శకత చంద్రబాబు ప్రత్యేకత అని అందుచేతనే చంద్రబాబు అక్రమ అరెస్టు చేస్తే అన్ని వర్గాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలందరూ ఖండించారని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ అన్నారు .
ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అరెస్టు అయినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటించాయని , దేశవ్యాప్తంగా మద్దతు పలికాయని , 70 దేశాలలో చంద్రబాబుకు సంఘీభావంగా ప్రదర్శనలు చేశారన్నారు . విడుదలైన రోజు రాజమండ్రి నుంచి విజయవాడ చేరడానికి రాత్రంతా జనం రోడ్డుపై జాగారం చేసి చంద్రబాబుకు స్వాగతం పలకడం వల్ల తెల్లవారేదాకా అంటే 12 గంటలు పట్టిందన్నారు . అరెస్ట్ అయినా ఏ రాజకీయ నేతకు ఇలాంటి సంఘీభావం లేదంటే అతిశయోక్తి కాదని మంత్రి ఫరూక్ తెలిపారు .

*టెర్రరిస్ట్ పాలనను తలపించేలా జగన్ పాలన*

జగన్ తన లూటీ నుండి ప్రజల దృష్టి మళ్ళించడానికి అధికారంలోకి రాగానే చంద్రబాబునాయుడు గారే లక్ష్యంగా రాజధాని భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ , ఇన్నర్ రింగ్ రోడ్డు , స్కిల్ డెవలప్మెంట్ లో అక్రమాలంటూ తప్పుడు కేసులు నమోదు చేశారని వారి ఆరోపణలకు కనీస ఆధారాలు చూపలేకపోయారన్నారు . అయితే ఐదేళ్ల జగన్ పాలనలో చంద్రబాబు నాయుడు పై 12 కు పైగా తప్పుడు కేసులు నమోదు చేశారని‌ అన్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగాధిపతిగా ఉన్న కొల్లి రఘురామిరెడ్డి , చంద్రబాబు నాయుడు , నారా లోకేష్ గార్లను వేధించడమే లక్ష్యంగా పనిచేశారన్నారు . సిట్ ఇంచార్జి రఘురామిరెడ్డిని నియమించి ఫైబర్ నెట్ , స్కిల్ , అమరావతి కేసుల్లో టిడిపి నేతలకు వేధించేందుకు ప్రయత్నించారన్నారు .

*అభివృద్ధి లక్ష్యంగా కూటమిపాలన*

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు . వృద్ధాప్య పింఛన్ 4000 పెంచడం , 16,347 ఉద్యోగాలతో మెగా డీఎస్సీ , ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు , అన్న క్యాంటీన్లు పునరుద్ధరణ , ప్రజా రాజధాని అమరావతి , పోలవరం నిర్మాణం , ప్రకృతి విపత్తుల సమర్థ నిర్వహణ వంటి వాటిపై దృష్టి పెట్టడం జరిగిందన్నారు . ఐదేళ్ల జగన్ పాలన లూటీలు , నేరాలు , కక్షలకు , కార్పన్యాలతో కాలం వెలబుచ్చితే , కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళుతుందని మంత్రి ఫరూక్ తెలియజేశారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580356
Total Users : 48040