ఆంధ్రప్రదేశ్
టెర్రరిస్టు పాలనను తలపించేలా అయిదేళ్ల వైసిపి పాలన : మంత్రివర్యులు ఎన్ఎండి ఫరుక్.

సయ్యద్. ఇక్బాల్ హుస్సేన్ నంద్యాల జిల్లా బ్యూరో.
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
చంద్రబాబును అక్రమ అరెస్టుకు ఏడాది.
చంద్రబాబు అభివృద్ధి , సంక్షేమం , సామాజిక న్యాయం ధ్యేయంగా పాలన చేశారని నీతి , నిజాయితీ , చట్టబద్ధత , పారదర్శకత చంద్రబాబు ప్రత్యేకత అని అందుచేతనే చంద్రబాబు అక్రమ అరెస్టు చేస్తే అన్ని వర్గాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలందరూ ఖండించారని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ అన్నారు .
ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అరెస్టు అయినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటించాయని , దేశవ్యాప్తంగా మద్దతు పలికాయని , 70 దేశాలలో చంద్రబాబుకు సంఘీభావంగా ప్రదర్శనలు చేశారన్నారు . విడుదలైన రోజు రాజమండ్రి నుంచి విజయవాడ చేరడానికి రాత్రంతా జనం రోడ్డుపై జాగారం చేసి చంద్రబాబుకు స్వాగతం పలకడం వల్ల తెల్లవారేదాకా అంటే 12 గంటలు పట్టిందన్నారు . అరెస్ట్ అయినా ఏ రాజకీయ నేతకు ఇలాంటి సంఘీభావం లేదంటే అతిశయోక్తి కాదని మంత్రి ఫరూక్ తెలిపారు .
*టెర్రరిస్ట్ పాలనను తలపించేలా జగన్ పాలన*
జగన్ తన లూటీ నుండి ప్రజల దృష్టి మళ్ళించడానికి అధికారంలోకి రాగానే చంద్రబాబునాయుడు గారే లక్ష్యంగా రాజధాని భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ , ఇన్నర్ రింగ్ రోడ్డు , స్కిల్ డెవలప్మెంట్ లో అక్రమాలంటూ తప్పుడు కేసులు నమోదు చేశారని వారి ఆరోపణలకు కనీస ఆధారాలు చూపలేకపోయారన్నారు . అయితే ఐదేళ్ల జగన్ పాలనలో చంద్రబాబు నాయుడు పై 12 కు పైగా తప్పుడు కేసులు నమోదు చేశారని అన్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగాధిపతిగా ఉన్న కొల్లి రఘురామిరెడ్డి , చంద్రబాబు నాయుడు , నారా లోకేష్ గార్లను వేధించడమే లక్ష్యంగా పనిచేశారన్నారు . సిట్ ఇంచార్జి రఘురామిరెడ్డిని నియమించి ఫైబర్ నెట్ , స్కిల్ , అమరావతి కేసుల్లో టిడిపి నేతలకు వేధించేందుకు ప్రయత్నించారన్నారు .
*అభివృద్ధి లక్ష్యంగా కూటమిపాలన*
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు . వృద్ధాప్య పింఛన్ 4000 పెంచడం , 16,347 ఉద్యోగాలతో మెగా డీఎస్సీ , ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు , అన్న క్యాంటీన్లు పునరుద్ధరణ , ప్రజా రాజధాని అమరావతి , పోలవరం నిర్మాణం , ప్రకృతి విపత్తుల సమర్థ నిర్వహణ వంటి వాటిపై దృష్టి పెట్టడం జరిగిందన్నారు . ఐదేళ్ల జగన్ పాలన లూటీలు , నేరాలు , కక్షలకు , కార్పన్యాలతో కాలం వెలబుచ్చితే , కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళుతుందని మంత్రి ఫరూక్ తెలియజేశారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక