ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాల వెల్లువ

సయ్యద్.ఇక్బాల్ హుస్సేన్
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ కి చెక్ అందజేత.
నంద్యాల ఎస్ డి ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అధినేత కొండారెడ్డి మరియు కరుణామయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ యాజమాన్యం దండే దస్తగిరి , దండే నరేష్ మరియు విద్యార్థినీ, విద్యార్థులు, ఉపాధ్యాయుల తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన వరద విపత్తుల కారణంగా నష్టపోయిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎస్ డి ఆర్ స్కూల్ లక్ష రూపాయలు , కరుణామయ స్కూల్స్ 30 వేల రూపాయలు విరాళంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్.ఎం.డి ఫరూక్ గారికి చెక్కులను అందించారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ప్రకృతి విపత్తులు ఏర్పడి తీవ్రంగా నష్టపోయిన వారికి తమ వంతు సహాయంగా పాఠశాల యాజమాన్యం , ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలో ఎలాంటి విపత్తులు ఎదురైనా నంద్యాల విద్యాసంస్థల తరఫున ఆపన్న హస్తం అందజేస్తున్నారని తెలియజేశారు . చిన్నప్పటి నుంచే విద్యార్థులకు సేవాగుణం అలవాటు చేస్తున్న ఎస్ డి ఆర్ స్కూల్స్ అధినేత కొండారెడ్డి ని మరియు కరుణామయ విద్యాసంస్థల చైర్మన్ దండే దస్తగిరి , దండే నరేష్ ని అభినందించారు. అందరూ ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు కష్టాలలో ఉన్న వ్యక్తులకు సహాయం అందించే గుణం అలవాటు చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రివర్యులు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఎస్డిఆర్ పాఠశాల అధినేత కొండారెడ్డి మరియు కరుణామయ పాఠశాల అధినేత దండే దస్తగిరి , కరస్పాండెంట్ దండే వెంకట నరేష్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువు, క్రమశిక్షణతో పాటు కష్టాలలో ఉన్న వ్యక్తులకు సహాయం అందించాలనే గుణం విద్యాసంస్థలలో పిల్లలకు నేర్పించడం జరుగుతుందని అన్నారు. ఒక్క పిలుపుతో విద్యార్థినీ, విద్యార్థులు ఉపాధ్యాయులు పెద్ద మొత్తంలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇవ్వడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర యువనాయకులు ఎన్ఎండి ఫయాజ్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక