ఆంధ్రప్రదేశ్
విద్యా ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం…… ఏఐఎస్ఎఫ్

ఏపీ న్యూస్ టుడే మంత్రాలయం రిపోర్టర్:
మంత్రాలయంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి…
అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ మంత్రాలయం మండల నూతన కమిటీ సమావేశం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఏఐఎస్ఎఫ్ తాలూకా అధ్యక్షులు వీరేష్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యస్. షాబీర్ భాష ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు, అనంతరం ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యస్. షాబీర్ భాష, జిల్లా సహాయ కార్యదర్శి , థామస్ లు మాట్లాడుతూ…. భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని బ్రిటిష్ పరాయి వలసవాదులను తరిమికొట్టాలని వీరోచిత పోరాటం చేసి దేశానికి అంకితం ఇచ్చిన భగత్ సింగ్ రాజ్ గురు సుగుదేవ్ వారి ఆశయాల సాధన కోసం ఏర్పడినటువంటి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ అన్నారు, మంత్రాలయం మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి పేద పొడుగు బలహీన వర్గాల విద్యార్థుల ఉన్నత చదువులకు పెంపొందించాలి అన్నారు. అదేవిధంగా దేశ బడ్జెట్లో విద్యారంగానికి 10 శాతం రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని గత కొన్ని దశాబ్దాలుగా పోరాడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిమ్మకు నేరెత్తినట్టు వివరిస్తున్నారని తక్షణమే కేంద్ర బడ్జెట్లో 10% రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు విద్యారంగానికి విడుదల చేయాలని డిమాండ్ చేశారు.నేను అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానన్న నరేంద్ర మోడీ మాటలు ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఉద్యోగ ఉపాధి కల్పన ఊసులేదని అందుకే అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ బిజెపి మతోన్మాద కాషాయకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటం నిర్వహిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో హామీలో భాగంగా జీవో నెంబర్ 77ను తక్షణమే రద్దు చేసి ఉన్నత చదువులు చదివేందుకు అవకాశం కల్పించాలన్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేసి విద్యార్థులను పెంచేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించి పాతబడినటువంటి భవనాలకు నూతన భవనాలు నిర్మించి పెండింగ్లో ఉన్న మెస్ ఛార్జీలు కాస్మోటిక్ ఛార్జీలు విడుదల చేయాలన్నారు.. జిల్లాలో అర్ధాంతరంగా నిలిచిపోయిన గురుకుల కేజీబీవీ పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాల విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న బోధన బోధ నేతల పోస్టులు భర్తీ చేయాలని, ప్రతి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఏపీ మోడల్ స్కూల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం ఏఐఎస్ఎఫ్ మండల నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది.మండల అధ్యక్షుడు గా, బి. తిరుమల ఉపాధ్యక్షులుగా, చంద్రశేఖర్, రాజు, వినోద్ కుమార్, నర్సప్ప,మండల ప్రధాన కార్యదర్శి గావి. అరుణాచారి, సహాయ కార్యదర్శిలుగా, పురేంద్ర, బి.రామకృష్ణ,హరి ,ఈ. వినోద్ కుమార్,కోశాధికారి గా, కె. వీరేష్,మహిళా కన్వీనర్ గా, బి. శిరీష,కో కన్వీనర్స్ గా బి.జై. రమాదేవి, లక్ష్మి,మల్లిక, మహా, వీరితోపాటు 19 మంది కార్యవర్గ సభ్యులు, 21మంది సమితి సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక