ఆంధ్రప్రదేశ్
ఈరోజు వరకు లోకాయుక్త సంస్థ నందు 1321 ఫిర్యాదులు నమోదు*.

లోకాయుక్త చీఫ్ జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి
కర్నూలు ఈ రోజు వరకు లోకాయుక్త సంస్థ నందు 1321 ఫిర్యాదులు నమోదు అయినట్లు
జస్టిస్ పి లక్ష్మణరెడ్డి తెలియజేశారు.
గురువారం లోకాయుక్త కార్యాలయంలో లోకాయుక్త చీఫ్ జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి గారు పదవీ విరమణ (శనివారం 14-09-2024) సందర్భంగా పాత్రికేయులతో సమావేశంనిర్వహించారు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ పి లక్ష్మణ రెడ్డి మాట్లాడుతూ 18-04-2022 తేదీన ప్రారంభించడం జరిగిందని అప్పటినుండి ఈరోజు వరకు లోకాయుక్త సంస్థ నందు 1321 ఫిర్యాదులు నమోదు అయినాయని తెలియజేశారు. లోకాయుక్తగా పదవీకాలం ఈనెల 14 వ తారీకు పూర్తి కావడం చేత ఆదివారం నుండి లోకాయుక్త విధులను ఉపలోకాయుక్త శ్రీమతి పి రజిని గారు నిర్వహిస్తారని తెలియజేశారు.1972 సంవత్సరం నుండి ప్రముఖ న్యాయవాద వృత్తికి పునాది వేసుకున్నానని కడప జిల్లా కోర్టులో న్యాయవాదిగా తన పేరు నమోదు చేసుకొని చిత్తశుద్ధి మరియు న్యాయపరమైన శ్రేష్ట్రతో న్యాయవాదిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ప్రస్తుతం లోకాయుక్త చీఫ్ జస్టిస్ గా విధులు నిర్వహిస్తూ శనివారం 14-09-2024 తేదీకి పదవీకాలం ముగియనున్నందున పదవీ విరమణ చేయడం జరుగుతుందన్నారు.లోకాయుక్త ద్వారా చట్టవిరుద్ధమైన కార్యకర్తలకు వ్యతిరేకంగా క్రియాశీలక చర్యలు కూడా తీసుకున్నానని, వృద్ధులకు, పిల్లలకు సంబంధించిన కేసులను అందరికీ న్యాయం చేసే విధంగా ఎన్నో పరిష్కారాలు చేశానని జస్టిస్ తెలియజేశారు. విద్యుత్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల యొక్క చట్టబద్ధమైన వారసులకు సంబంధిత పవర్ కార్పొరేషన్ వారు ఎక్స్గ్రేషియా చెల్లించే విధంగా చర్యలు తీసుకొని న్యాయం చేయడం జరిగిందన్నారు. దుర్వినియోగమైన సొమ్ములను ప్రభుత్వ ఖజానాలకు జమ చేసే విధంగా ఎన్నో కేసులను పరిష్కరించడం జరిగిందని చీఫ్ జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి గారి తెలియజేశారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక