ఆంధ్రప్రదేశ్
కొండారెడ్డి బురుజు కన్నా బి.కె.సింగ్ భూ అక్రమాలలో ఫేమస్ అవుతున్నారు

కర్నూలు మునిసిపల్ కమీషనర్ వినాయకుని నిమజ్జనం రోజు మీ డ్యాన్స్ అద్బుతంగా ఉంది అక్రమ కట్టడాలపై కూడా మీ చర్యలు అద్బుతంగా ఉండాలని కోరుకుంటున్నాము.
ఇష్టారాజ్యంగా సిటీ ప్లానర్ అప్రువల్స్ ఇవ్వడం, ఎవ్వరేమి చేసుకోలేరులే అని కష్టమర్లకు బరోస ఇవ్వడం ఆశ్చర్యకరం
కలెక్టర్ ఆర్డర్ బేఖాతరు
అధికారులు అంతా మా దగ్గర డబ్బులు తీసుకున్నారు కూల్చటానికి వచ్చేదెవరు అనీ ధీమా వ్యక్తం చేస్తున్న బిల్డర్
చిటికేస్తే అధికారులు నా జేబులో ఉంటారంటున్నా బి.కె.సింగ్
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
ఈ సందర్భంగా రాయలసీమ యువజన విద్యార్థి నాయకులు, కర్నూలు విఠల్ నగర్ లో హంద్రీనది మరియు బఫర్ జోన్ లో నిర్మాణాలను అక్రమంగా నిర్మిస్తున్న అగ్రసేని రియల్టర్ బి.కె.సింగ్ కట్టడాల దగ్గర సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా నాయకులు, రంగముని నాయుడు, సీమ కృష్ణా నాయక్, కురువ సంకన్న, వి.వి.నాయుడు లు మాట్లాడుతూ కర్నూలులో అగ్రసేని రియల్టర్ అన్ని రకాల ప్రభుత్వ భూములతో వ్యాపారం చేసారన్నారు. అదే క్రమంలో విఠల్ నగర్ దగ్గర ఏకంగా హంద్రీనది మరియు బఫర్ జోన్ లో నిర్మాణాలు చేసి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నారన్నారు, వీటిపై స్పెషల్ టీం ఎంక్వరీ రిపోర్ట్ ఆధారంగా కలెక్టర్ గారు సంవత్సరం క్రిందట్ తొలగించాలని ఆర్డర్ ఇవ్వగా ఇంతవరకు సంబందిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం అతని మ్యానేజింగ్ ఏ స్థాయిలో ఉందో అధికారులు ఏ మాత్రం అమ్ముడు పోయారు అర్థం అవుతుంది అన్నారు, వీటిపై పత్రికలు, మీడియా, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే అక్కడ కొనుగోలు చేసిన కష్టమర్లు సిటీ ప్లానర్ ను సంప్రదిస్తే మీకేమవ్వదు అని భరోసా ఇస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రెస్, ప్రజా సంఘాల వారిపై డబ్బులు కోసం ఇదంతా చేస్తున్నారని వారికి చెప్పడం కర్నూలు మునీసిపాలిటి అధికారులు ఏ మాత్రం అవినీతిలో భాగస్వాములు అవుతున్నారో అర్థం అవుతుంది అన్నారు, కర్నూలులో మునిపాలిటీ, రిజిస్ట్రేషన్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల సహకారంతో హంద్రీనదిని రియల్ ఎస్టేట్ వ్యాపార నదిగా మారుస్తున్నారన్నారు, కర్నూలును వరదలకు కారకులు అవుతున్నారన్నారు, ఇప్పటికీ నది ఆక్రమణ జరిగి నీళ్ళు ఆనంద్ థియేటర్ దగ్గర రోడ్డులో చేరి ముఖ్య రహదారి మూసుకుపోతుంది అన్నారు, ఇక బి.కె.సింగ్ అదే వెంచర్ కు రోడ్డు కోసం దేవాలయ భూమిని ఆక్రమించారన్నారు, కాసులకు కక్కుర్తి పడి రియల్టర్ తో చేతులు కలిపిన అధికారులు బి.కె.సింగ్ డైరెక్షన్ లో నడుస్తున్నారన్నారు, అలాగే పసుపుల రెవెన్యూ లో సర్వేనెంబర్లు: 295, 319, 293, 294, పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాల తిరుమలగిరి వెంచర్లో కోట్లు విలువ చేసే దేవాలయ భూమితో పాటు వాగును ఆక్రమించి ప్లాట్లు వేసి అమ్మారన్నారు, అలాగే లక్ష్మిపురం రెవెన్యూ రింగ్ రోడ్డు దగ్గర ఉన్న తిరుమలగిరి వెంచర్లో వాగు భూమి 2.16 సెంట్లు ఆక్రమించి ప్లాట్లు మరియు నిర్మాణాలు చేపట్టారని అన్నారు, అలాగే కల్లూరు గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్: 645/A నంద్యాల రోడ్డులో టి.వి.టవర్ ఆపోజిట్ గా వక్ఫ్ భూమిలో డూప్లేక్స్ లు నిర్మాణం చేసి అమ్మారన్నారు, అలాగే పెద్దపాడు రెవెన్యూలో సర్వేనెంబర్: 201 కుఠను పూడ్చారన్నారు ఈ విధంగా అతని అక్రమాలు అనేకం అన్నారు, అలాగే ఇతను అప్రువల్స్ కూడా పాత డేట్లతో తప్పుడు అప్రువల్స్ తీసుకొని ప్లాట్లు విక్రయిస్తుంటారన్నారు, ఇతని అక్రమాలపై దర్యాప్తు సంస్థలచే విచారణ జరిపించి కఠినమైన చర్యలు తీసుకోవాలి అన్నారు. కస్టమర్లు కూడా అతని వ్యాపార మార్కెటింగ్ మాయా మాటలను నమ్మి నష్టపోవద్దు అన్నారు, ఈ కార్యక్రమంలో నాయకులు హరిగౌడ్, వసంత్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక