ఆంధ్రప్రదేశ్
నిరుపేదల సొంతంటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం. జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
నిరుపేదల సొంతింటి కలలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు.
మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో భువనేశ్వర్ నుంచి పి ఎం ఏ వై గ్రామీణ్ మరియు అర్బన్ కు సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 విధివిధానాలను ప్రారంభించిన భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వర్చువల్ సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దేశంలోని గ్రామీణ మున్సిపల్ ప్రాంతాలు మరియు అర్బన్ డెవలప్మెంట్ ప్రాంతాలలో 2023 24 సంబంధించి నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఒక కోటి కొత్త ఇండ్లకు భువనేశ్వర్ నుండి ప్రధానమంత్రి వర్చువల్ గా ప్రారంభోత్సవం చేశారు. అలాగే ప్లస్ 2024 యాప్ ను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. వర్చువల్ సమావేశం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జారీచేసిన నూతన విధివిధానాలను ప్రతి ఒక్కరు అవగాహన కలిగించుకోవాలన్నారు. ఇల్లులేని ప్రతి నిరుపేదకు ఒక గూడు ఏర్పాటు చేయడం మనందరి బాధ్యత అన్నారు. జిల్లాలో ఇప్పటికే గృహాలు మంజూరైన వారందరూ త్వరగా ఇళ్లను పూర్తిచేసుకునేలా గృహ నిర్మాణ శాఖ చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న కాలనీలలో మౌలిక సదుపాయాలన్నింటిని కల్పించాలన్నారు. సొంత ఇంటిలో ప్రతి కుటుంబం ఆనందంగా జీవించేలా అన్ని సౌకర్యాలు సమన్వయంగా పూర్తి చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణం తుది దశలో ఉన్న గృహాలన్నింటిని త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ వెంకటసుబ్బయ్య, గృహ నిర్మాణ శాఖ ఇంజనీర్లు, సిబ్బంది, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులకు ఇంటి పత్రాలు పంపిణీ చేశారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక