ఆంధ్రప్రదేశ్
పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలి….. రేంజి అధికారి శ్రీపతి నాయుడు.
నంద్యాల జిల్లా రుద్రవరం.
ఏపీ టుడే న్యూస్ :
పర్యావరణ పరిరక్షణ లో ప్రజలు భాగస్వాములు కావాలని రుద్రవరం అటవీ రేంజ్ అధికారి శ్రీపతి నాయుడు తెలిపారు. గురువారం స్వచ్ఛ యాక్షన్ ప్లాన్ నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ సూచనల మేరకు స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్ట్ టైగర్ అనురాగ్ మీనా ఐఎఫ్ఎస్ ఆదేశాల మేరకు నర్సాపురం గ్రామంలోని సెయింట్ మార్తో మా ఉన్నత పాఠశాల ఆవరణము లో రుద్రవరం అటవీ రేంజ్ సిబ్బంది గాంధీ జయంతికి 15 రోజులు ముందుగా అనగా (17 వ తేది సెప్టెంబర్ 2024 నుండి అక్టోబర్ రెండవ తేదీ 2024) వారి ఆశయాలను నెరవేర్చాలనే ఉద్దేశముతో స్వచ్ఛత మరియు పరిసరాల పరిశుభ్రత వంటి కార్యక్రమాలను నిర్వహించడమైనది. మానవ మనుగడ కొనసాగించాలంటే స్వచ్ఛమైన గాలిని పీల్చు కోవడం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కనీసము ఒక మొక్కను నాటి సంరక్షించాలని, గ్రామ పరిసరాలను అన్నింటిని పరిశుభ్రంగా ఉంచాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని స్వచ్ఛహిత సేవా కార్యక్రమాల్లో భాగంగా పిలుపునివ్వడమైనది. ఎక్కడ కూడా ప్లాస్టిక్ ను వాడరాదని ,100% ప్లాస్టిక్ రహిత పర్యావరణాన్ని సాధించాలని, ప్రతి ఒక్కరూ గ్రామ వీధులను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్
డేవిడ్ జాన్ వర్గీస్ వారి సిబ్బంది , గ్రామ సర్పంచ్ జి .శాంత కుమారి , గ్రామ పెద్దలు జి .పెద్ద పకీరయ్య, అహోబిలం డిప్యూటీ రేంజ్ అధికారి ఎస్. ముర్తుజావలి, సెక్షన్ ఆఫీసర్లు ఎన్. శ్రీనివాసులు రెడ్డి, ఎస్ మక్తర్ భాష, ఆర్ వి .రానెమ్మ, బీట్ ఆఫీసర్స్ T.రామకృష్ణ , నాగేంద్రయ్య , మాబుఖాన్ , సురేంద్ర గౌడ్, ఓ. నరసింహారెడ్డి , జేమ్స్ పాల్, జంగం సుభాష్, విజయవర్ధన్, మదన్ గోపాల్, హుస్సేన్ భాష మరియు నర్సాపురం చెక్ పోస్ట్ ఏ బి ఓవెంకటేశ్వర రెడ్డి, ప్రొటెక్షన్ వాచర్ దానమయ్య , గ్రామ పారిశుద్ధ్య కార్మికులు మరియు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు అందరూ పాల్గొని సెయింట్ మార్తోమా స్కూల్ ఆవరణలో ప్రతిజ్ఞ చేయించి పరిసరాలను శుభ్రం చేయించడమైనది.

-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68045