ఆంధ్రప్రదేశ్
సీఎం చంద్రబాబు, మంత్రి టి.జి భరత్ ఫ్లెక్సీకి పాలాభిషేకం

ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ఫ్లెక్సీలకు జిల్లా కోర్టు వద్ద తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్, కర్నూల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం బాణ సంచా కాల్చి న్యాయవాదులు సంబరాలు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణమూర్తి, కార్యదర్శి రవికాంత ప్రసాద్, తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాశెట్టి శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు కేఈ జగదీష్, కార్యదర్శి నాగ ముని తోపాటు న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతోకాలంగా రాయలసీమ ప్రాంత న్యాయవాదులు ఎదురుచూస్తున్న హైకోర్టు బెంచును కర్నూల్ లో ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు నిర్ణయం వెలువడటం వెనుక రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కృషి ఎంతో ఉందని వారు తెలియజేశారు. కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం వెలువడిన నేపథ్యంలో రాయలసీమలోని న్యాయవాదులు ఆనందాన్ని వ్యక్తం చేశారని చెప్పారు.
రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు కోసం డిమాండ్ ఉన్నప్పటికీ అది అమలు చేసేందుకు సాధ్యం కాని పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన 100 రోజుల అనంతరం కర్నూల్ లో హైకోర్టు బెంచి ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని తెలిపారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సాధ్యం కాదని తెలిసినప్పటికీ కర్నూల్ ను న్యాయ రాజధాని అని ప్రకటించారని చెప్పారు. 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పటికీ న్యాయ రాజధాని ఏర్పాటు చేయకపోగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రయత్నాలు కూడా చేయలేదని వారు విమర్శించారు. చివరకు న్యాయ రాజధాని ఏర్పాటు విషయంపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని వివరించారు. చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చాక కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తూ మాటలు నిలుపుకున్నారని ప్రశంసించారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక