ఆంధ్రప్రదేశ్
బ్యాంకర్లు, వ్యవసాయం, విద్య, ఎం.ఎస్.ఎం.ఈ, ప్రాదాన్యత రంగాలకు లక్ష్యం మేరకు రుణాలు మంజూరు చేయాలి: తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తి.

ఏపీ టుడే న్యూస్;
తిరుపతి, సెప్టెంబర్ 24 : బ్యాంకర్లు వ్యవసాయం, విద్య, ఎం.ఎస్.ఎం.ఈ వంటి ప్రాదాన్యత రంగాలకు లక్ష్యం మేరకు రుణాల మంజూరు చేసి అభివృద్ధికి తోడ్పడాలని తిరుపతి పార్లమెంటు సభ్యుడు గురుమూర్తి బ్యాంక్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తి, జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ఎల్డీఎం విశ్వనాథ రెడ్డి, ఆర్బిఐ ఎల్ డి ఓ పూర్ణిమ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ రాంప్రసాద్, వివిధ బ్యాంకు అధికారులుతో కలిసి జిల్లాస్థాయి రివ్యూ కమిటీ (డి.ఎల్.ఆర్.సి) సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి హాజరైన తిరుపతి పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ.. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయం, విద్య, ఎం.ఎస్.ఎం.ఈ తో పాటు విద్యా రంగానికి కూడా అధిక ప్రాదాన్యతనిస్తూ బ్యాంకర్లందరూ రుణాలను మంజూరు చేయాలని, ఎలాంటి అలసత్యం వహించరాదని కోరారు. బ్యాంకర్లు విద్యారంగాన్ని ప్రాధాన్యతగా తీసుకొని రుణాలు మంజూరు చేయడం వలన విద్యార్థులు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని తెలిపారు. కావున బ్యాంకర్లు నిర్దేశించబడిన లక్ష్యాలను అందిపుచ్చుకోవాలని కోరారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే తగు స్థాయిలో విద్యార్థులకు రుణాలు ఇస్తున్నారని ప్రైవేటు రంగ బ్యాంకులు కూడా లక్ష్యం మేరకు రుణాలు అందించాలని పిలుపునిచ్చారు. సత్యవేడు నియోజకవర్గం బిన్ కండ్రిగ మండలం కోవనూరులో బ్యాంకు ఏర్పాటు చేయాలని నేడు జరిగిన డీసీసీ మీటింగులో బ్యాంకర్లకి సూచించారు. శ్రీకాళహస్తి రైల్వేస్టేషన్ ద్వారా శ్రీకాళహస్తీశ్వరుని దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు ప్రయాణిస్తుంటారని వారి సౌలభ్యం అక్కడ ఎటిఎం ఏర్పాటు చేయవలసినదిగా ఎంపీ గురుమూర్తి కోరారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక