Connect with us

ఆంధ్రప్రదేశ్

పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయండి. – జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్.

Published

on

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.

జిల్లాలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ టూరిజం అధికారులను సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల సందర్భంగా వ్యాసరచన, వక్తృత్వ క్విజ్ పోటీలలో గెలుపొందిన పాఠశాల విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవంలో జాయింట్ కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ మాట్లాడుతూ జిల్లాలో పర్యాటకంగా అభివృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని వీటన్నింటినీ మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని టూరిజం అధికారులను సూచించారు. జిల్లాలో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, ప్రఖ్యాతిగాంచిన గుహ సంపదలు ఉన్నాయని వాటన్నింటినీ ప్రోత్సహించి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. విద్యార్థులు విద్యార్థి దశ నుండే పర్యాటక రంగంపై అవగాహన పెంపొందించుకోవాలని జేసి సూచించారు. పర్యాటక రంగం ద్వారానే ప్రపంచంలోని అన్ని దేశాలు శాంతి మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందాయన్నారు. అలాగే ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక మందికి ఉపాధి అవకాశాలు లభ్యమవుతున్నాయని జాయింట్ కలెక్టర్ వివరించారు. పర్యాటక రంగం వల్ల ఆదాయం వనరులు సమకూరి దేశ వృద్ధిరేటు పెరుగుతోందన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవ సందర్భంగా విద్యార్థులలో జిల్లాలోని ప్రధాన దేవాలయాలు, చారిత్రాత్మక ప్రదేశాలు, కట్టడాలు తదితర అంశాలలో వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖన పోటీలు నిర్వహించామన్నారు.
పర్యాటక రంగ అభివృద్ధి అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రముఖ పర్యటక ప్రదేశాలను ఏడు టూరిజం సర్క్యూట్లుగా విభజించి అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. ఒకటవ సర్క్యూటివ్ గా నవనందులు, రెండవ సర్క్యూటివ్ గా మహానంది, పచ్చర్ల, సర్వనర్సింహస్వామి ఆలయం, మూడవ సర్క్యూటివ్ గా ఓంకారం, వైయస్సార్ స్మృతి వనం, బైర్లూటి, నాల్గవ సర్క్యూటివ్ గా అహోబిలం నవ నర్సింహులు, ఐదవ సర్క్యూటివ్ గా యాగంటి, నవాబ్ బంగ్లా, బెలూమ్ గుహలు, ఆరవ సర్క్యూటివ్ గా నందవరం, కొత్తూరు సుబ్బరాయుడు, ఏడవ సర్క్యూటివ్ బిలస్వర్గం గుహలు, వాల్మీకి గుహలు, ఆర్ఎస్ రంగాపురం దేవస్థానంలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. సంగమేశ్వరం, శ్రీశైలం వద్ద ఐకానిక్ టూరిస్ట్ కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు.
అనంతరం స్వదేశీ దర్శన్ 2.0 ఛాలెంజ్ డెస్టినేషన్ జాయింట్ కలెక్టర్ ఆవిష్కరించారు. క్విజ్ పోటీలలో గెలుపొందిన వివిధ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు ప్రధానం చేశారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580346
Total Users : 48030