Connect with us

ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛత’ ప్రతి ఒక్కరి బాధ్యత*

Published

on

రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టి.జి. భరత్

ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో

వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల ‘స్వచ్ఛత’ ప్రతి ఒక్కరి జీవన విధానం కావాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టి.జి. భరత్ పేర్కొన్నారు. బుధవారం గార్గేయపురం డంపింగ్ యార్డు వద్ద ఎమ్.ఆర్.ఎఫ్ (మెటీరియల్ రికవరీ ఫెసిలిట్ ప్లాంట్ నిర్మాణానికి మంత్రి, జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, మేయర్ బి.వై. రామయ్య, ఎమ్మెల్యేలు గౌరు చరిత రెడ్డి, బొగ్గుల దస్తగిరి, కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు శంకుస్థాపన చేశారు.

గత నెల 17వ తేదీ నుండి స్వచ్ఛత హి సేవ కార్యక్రమాలు చేపట్టిన నగరపాలక సంస్థ చివరి రోజు గాంధీ జయంతి నాడు‘స్వచ్ఛ భారత్ దివస్ – 2024’ కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. అందులో భాగంగా రూ.9.88 కోట్లతో స్వచ్చ్ భారత్ మిషన్ 2.0, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ నిధులతో ఎం.ఆర్.ఎఫ్. ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ ప్లాంట్ రానున్న ఆరు నెలల్లో పూర్తి కానుంది. వీటి వల్ల ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేయడం, పొడి చెత్తతో ఎరువును తయారు చేయడం, ఇతర జడ వ్యర్థాలతో భవన, రహదారుల నిర్మాణాలకు ఉపయోగించడం వంటివి చేయవచ్చునని మంత్రి అన్నారు. అక్టోబర్ 2 అనగానే కర్నూలుకు వరద వచ్చిన సంగతి గుర్తుకు వస్తుందని, దానిని గుర్తు చేసుకుంటే ప్రకృతి విపత్తులు ఎంత భయంకరంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చన్నారు. అందుకే పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రానున్న రోజుల్లో గార్గేపురం డంప్ యార్డు పరిసరాల ప్రజలు ఎలాంటి వ్యాధుల బారినపడకుండా మంచి వాతావరణం నివాసాలు ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. వచ్చే ఏప్రిల్‌లో ఎంఆర్ఎఫ్ ప్రారంభిస్తామని, ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపడతామని పేర్కొన్నారు.

పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ గాంధీ జయంతి రోజును పురస్కరించుకొని గార్గేయపురం వద్ద ఉన్నటువంటి డంపు యార్డులో తడి చెత్త పొడి చెత్తను వేరుచేసి రీసైకిలింగ్ చేయడానికి సాయి పావని కన్సల్టేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి ద్వారా ఎమ్.ఆర్.ఎఫ్ (మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ)యూనిట్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించుకున్నామన్నారు. పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు ఎలాంటి హాని కలవకుండా ఉండుట కొరకే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఎంపీ అన్నారు. ఈ యూనిట్ నుండి వచ్చే బైక్ ప్రొడక్ట్స్ కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వాలు ఈ కార్యక్రమాలను చేపట్టాయి అని ఎంపీ అన్నారు.

జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా మాట్లాడుతూ ఈ రోజు గాంధి జయంతి సందర్భంగా మనం గత 15 రోజులగ స్వచ్ఛతా హి సేవా,స్వచ్చ ఆంధ్ర కార్యక్రమాలు నిర్వహించుకున్నామని, మొదటి రోజు న జిల్లా వ్యాప్తంగా ర్యాలీ లు మానవహారము కార్యక్రమాలు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రం చేయడం వంటి కార్యక్రమాలు, జిల్లాలో ప్రతి గ్రామంలోని మురుగు కాలువలను శుభ్రం చేయడం సాలిడ్ వేస్ట్ ను తొలగించడం వంటి కార్యక్రమాలు జిల్లాలోని అన్ని గ్రామా పంచాయితీలలో గత 15 రోజుల నుంచి నిర్వహించడం జరిగిందని, దాదాపు 5 000 ఈవెంట్స్ ను పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖలు స్వచ్ఛంద సంస్థల వారు ప్రజలు సహకారంతో నిర్వహించుకున్నాం అని అన్నారు. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 9.88 కోట్ల రూపాయల వ్యయంతో ఎమ్.ఆర్.ఎఫ్ (మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ)యూనిట్ కు శంకుస్థాపన నిర్వహించుకుంటున్నామన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడికి వచ్చేటువంటి చెత్తాచెదారులను సెక్రిగేట్ చేసి అందులో నుండి వచ్చేటువంటి పదార్థాలతో బై ప్రొడక్ట్స్ తయారు చేయడం జరుగుతుందన్నారు. ప్రజలకు ముఖ్యంగా విజ్ఞప్తి చేయడమేమంటే ప్రజలందరూ వ్యక్తిగతంగా మరియు సామాజికంగా పరిశుభ్రతను పాటించినప్పుడే మనం విజయాలు సాధించగలుగుతామని కలెక్టర్ పేర్కొన్నారు.

పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితా రెడ్డి మాట్లాడుతూ ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా వారి ఆశయాలకు అనుగుణంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేపట్టిన స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వ తేదీ వరకు నిర్వహించుకున్నం,ఈ రోజు గార్గేయపురం పరదిలో ని డంప్ యార్డు నందు దాదాపు 10 కోట్ల రూపాయల వ్యయముతో యం ఆర్ ఎఫ్ (మెటీరియల్ రికవరీ ఫెసిలిటి) యూనిట్ కొరకు భూమి పూజ కూడా నిర్వహించుకున్నామన్నారు.

కోడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ, కర్నూలు నగరంలోని చెత్తాచెదాలను.గార్గేయపురము పరది లోని డంప్ యార్డు కు తరలించడం జరుగుతుంది. వీటిని శ్రీ సాయి ఏజెన్సీ వారి ద్వారా ఇక్కడ ఉన్న తడి పొడి చెత్తను వేరుచేసి మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ యూనిట్ ద్వారా వేరు చేయడం జరుగుతుందని. తద్వారా వచ్చిన వేస్టేజ్ ని కూడా పొలాల్లో ఎరువుగా వినియోగించుకోన్న వచ్చునని ఆయన అన్నారు.

మేయర్ మాట్లాడుతూ 15 రోజులుగా స్వచ్చత హి సేవ‌లో భాగంగా నగరపాలక వివిధ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఎంఆర్ఎఫ్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. దీనిని గాంధీ జయంతి నాడు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారాలతో, ప్రజప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో నగరాన్ని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

కమిషనర్ మాట్లాడుతూ మనుషులు కలిసి ఉంటే బలం, ప్రగతి సాకారం అవుతుందని, అదే వ్యర్థాలు కలిసి ఉంటే చాలా ప్రమాదాలకు దారి తీస్తుందన్నారు. కాబట్టి వాటి ఆవశ్యకతను గుర్తించి, ఎంఆర్ఎఫ్ నిర్మాణానికి నాంది పలికామన్నారు.

హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారు లు మొక్కలు నాటినారు, స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా ఉత్తమ పారిశుద్ధ్య కార్మికులను సత్కరించి, బహుమతులు అందజేశారు.

కార్యక్రమంలో ఆర్డిఓ శేషిరెడ్డి, తహసిల్దార్ రమేష్ బాబు, డిప్యూటి మేయర్ సిద్దారెడ్డి రేణుక, కార్పొరేటర్లు ఎం.విక్రసింహా రెడ్డి, పరమేష్, రమణమ్మ, జకియా అన్సారీ, ఆరోగ్యధికారి డా.వి. విశ్వేశ్వర రెడ్డి, ఎస్ఈ జి.రాజశేఖర్, ఎంఈ సత్యనారయణ, డిఈఈ నరేష్, ఏఈ దినేష్ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580074
Total Users : 47758