Connect with us

ఆంధ్రప్రదేశ్

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకించండి, ప్రజా సంఘాల నిరసన దీక్ష .

Published

on

ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్.

విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం జరుగుతున్న ఆందోళనలో రాష్ట్ర ప్రజానీకం కార్మికులు ఉద్యోగులందరూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకించీ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.గురువారం నంద్యాల పట్టణం లోని తాసిల్దార్ కార్యాలయం ముందు ఏపీ రైతు సంఘం కౌలు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్షను ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు టీ, రమేష్ కుమార్ పూలమాలలు వేసి ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా జరిగిన ప్రారంభ సభకు అధ్యక్షులుగా రైతు సంఘం సీనియర్ నాయకులు సుబ్బరాయుడు అధ్యక్షత వహించారు. దీక్ష కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టి రమేష్ కుమార్, రశేఖర్, సోమన్న, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు శంకర్ లు మాట్లాడుతూ ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతికగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుందని ఎన్నికల ముందు విశాఖ ఉక్కుల ను ప్రైవేట్ పరం చేయమని చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలా స్పీడ్ గా విశాఖ ఉక్కు ను ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నాలు వేగవంతం చేసిందని ఇప్పటికే అందులో పనిచేస్తున్నటువంటి 4,000వేల మంది కాంట్రాక్టు కార్మికులను రాత్రికి రాత్రికి ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారని ఇది అత్యంత దుర్మార్గంగా ఉందని 2,500 మందికి పైగా విఆర్ఎస్ ప్రకటించి ఉద్యోగులను ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తుందని, దీనికి తోడు మరో 500 మందికి పైగా ఉద్యోగులను డిప్టేషన్ పేరుతో వివిధ సంస్థలకు పంపించే ఏర్పాట్లు చేస్తుందని అన్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే విశాఖ ఉక్కును కారు చౌకగా అమ్మేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంటే ఇక్కడున్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళ అడుగులకు మడుగులు వత్తుతూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికే తలమానికంగా ఉన్న విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయడానికి మూగెద్దుల్లా తల ఊపుతున్నారని ఇది చాలా దుర్మార్గమైన చర్య అని అన్నారు.ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మొత్తాన్ని మోసం చేయడమేనని కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు కార్మికులు ప్రజలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ భవిష్యత్తులో జరగబోయే ఆందోళనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం రైతు సంఘం ఉపాధ్యక్షులు సురేష్, వీరన్న, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సిపిఐ రైతు సంఘం నాయకులు వెంకటేశ్వర్లు, నరసింహులు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు శంకర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం నాయకులు సిపిఐ రైతు సంఘం నాయకులు సిపిఎం న్యూ డెమోక్రసీ రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580402
Total Users : 48086