ఆంధ్రప్రదేశ్
అట్టహాసంగా ప్రారంభమైన జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలు

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
23 రాష్ట్రాల నుండి పాల్గొన్న టీంలు.
ఆకట్టుకున్న క్రీడాకారుల మార్చ్ ఫాస్ట్.
నంద్యాల జిల్లా కేంద్రంగా జాతీయస్థాయి సాఫ్ట్బాల్ పోటీలు.
నంద్యాల జిల్లా కేంద్రంగా మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా దాదాపు 23 రాష్ట్రాల నుండి క్రీడాకారులు పోటీలలో పాల్గొంటున్నారు. శ్రీ గురురాజా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 42 వ జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీల ప్రారంభోత్సవానికి ముందు క్రీడాకారులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ అతిధులను ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం జాతీయ జెండాను సాఫ్ట్బాల్ పోటీల పతాకాలను అతిథులు ఎగురవేసి పోటీలను ప్రారంభించారు.
జాతీయస్థాయి పోటీలను నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ చైర్మన్ డాక్టర్ పి దస్తగిరి రెడ్డి, ఐక్య ఉపాధ్యాయ సంఘాల నాయకుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, టిడిపి జాతీయస్థాయి సాఫ్ట్బాల్ సెక్రెటరీ మౌర్య, ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ నాగేంద్ర, కర్నూలు జిల్లా సాఫ్ట్బాల్ సెక్రెటరీ విజయకుమార్ తోపాటు శ్రీ గురు రాఘవేంద్ర విద్యాసంస్థల డైరెక్టర్ పి షేక్షావల్లి రెడ్డి, 23 రాష్ట్రాల నుండి పాల్గొన్న ఆయా టీమ్ల సెక్రటరీలు బృందం సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నంద్యాల జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో మొదటిసారిగా జాతీయస్థాయి పోటీలను నిర్వహిస్తున్న డాక్టర్ పి దస్తగిరి రెడ్డి, డాక్టర్ రామకృష్ణారెడ్డి లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ విద్యాసంస్థలు క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని ఇలాంటి విద్యా సంస్థలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు మంత్రి ఎన్ఎండి ఫరూక్ తరఫున అందించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని తెలిపారు. డాక్టర్ పి దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో మొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ పోటీలకు శ్రీ గురు రాఘవేంద్ర విద్యాసంస్థలు ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉందని తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తాము ఎలాంటి సహాయ సహకారమైన అందించేందుకు సిద్ధంగా ఉంటామని తెలిపారు. క్రీడాకారుల్లో నూతన ఉత్సాహం నింపేలా వారికి మెరుగైన వసతులు కల్పిస్తూ పోటీలు ముగిసే వరకు పూర్తి సహకారంగా ఉంటామని అన్నారు. శ్రీ గురు రాఘవేంద్ర విద్యాసంస్థలు చదువులకే కాకుండా క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇస్తుందని తెలిపేందుకు ఇదే నిర్దర్శనమని గుర్తు చేశారు. జాతీయస్థాయి సాఫ్ట్బాల్ సెక్రెటరీ మౌర్య మాట్లాడుతూ తాను ఎన్నో సాఫ్ట్ బాల్ పోటీల నిర్వహణను చూశానని నంద్యాలలో ఇలాంటి పోటీలను నిర్వహించేందుకు ముందుకు వచ్చిన శ్రీ గురు రాఘవేంద్ర విద్యాసంస్థలు, శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు. అన్ని ప్రాంతాల్లో నిర్వహించే పోటీల కంటే ఎంతో ప్రత్యేకతను చాటుకుందని, నంద్యాల ప్రాంతం అంటే క్రీడలకు ప్రసిద్ధి అనేందుకు ఇది నిదర్శనమని కొనియాడారు. ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో క్రీడలకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. జాతీయస్థాయి సాఫ్ట్బాల్ పోటీలు శ్రీ గురు రాఘవేంద్ర, శ్రీ రామకృష్ణ కళాశాలల ఆధ్వర్యంలో నిర్వహించడం ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు. ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు నంద్యాల జిల్లా వేదిక అవ్వడం ఎంతో శుభ పరిణామమని అన్నారు. నంద్యాల ప్రాంతం అంటే క్రీడలకు ప్రసిద్ధి చెందినదని ఎంతోమంది జాతీయ రాష్ట్ర జిల్లా స్థాయిలో తమ సత్తా చాటుతున్నారన్నారు. మరెన్నో క్రీడా పోటీలు నంద్యాలలో నిర్వహించేలా ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని తెలిపారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక