ఆంధ్రప్రదేశ్
ప్రజా సమస్యలు రీ ఓపెన్ కాకుండా నాణ్యమైన పరిష్కారం చూపండి

సమస్యల పరిష్కారంపై సిఎం కార్యాలయం నుంచి పర్యవేక్షణ
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
ప్రజలు తమ సమస్యలను మళ్లీ మళ్లీ రీ ఓపెన్ చేయకుండా నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ – పిజిఆర్ఎస్) కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.
ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు.. సమస్యలు రీఓపెన్ కాకుండా చూడాలని కలెక్టర్ అధికారులు ఆదేశించారు. పత్తికొండ ఆర్డీఓ కు సంబంధించి 3, డిఐజి కి సంబంధించి 3, కర్నూలు ఆర్డీఓ కు సంబంధించి 1, సబ్ కలెక్టర్ ఆదోని కి సంబంధించి 1, ల్యాండ్ అండ్ సర్వేకు సంబంధించి 1, ఎస్డిపిఓ కు సంబంధించి 1, ఆలూరు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులుకు సంబంధించి 1, రీఓపెన్ అయ్యాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.సిఎంఓ గ్రీవెన్స్ కు సంబంధించి ఆదోని సబ్ కలెక్టర్ 13, కర్నూలు ఆర్డీఓ 9, పత్తికొండ ఆర్డీఓ 2, డిఎస్ఓ 2, హౌసింగ్ 2, బిసి సంక్షేమం 2, వ్యవసాయం 1, ఏఓ కలెక్టరేట్ 1, నైపుణ్య అభివృద్ధి 1, డిపిఓ 1, ఎంసి గూడూరు 1, డిఆర్డిఎ పిడి 1, ఆర్డబ్ల్యూఎస్ 2, డ్వామా 1, ఐసిడిఎస్ 1, పంచాయతీ రాజ్ 1, ఏపిఐఐసి 1 ఫిర్యాదులు పెండింగ్ ఉన్నాయని, వీటిని వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.. పిజిఆర్ఎస్ కు సంబంధించి వస్తున్న ఫిర్యాదుల పై సిఎంఓ కార్యాలయం నుంచి విశ్లేషణ జరుగుతోందన్నారు.ఏ శాఖలో ఎక్కువ శాతం ఫిర్యాదులు వస్తున్నాయి, ఏ శాఖలో ఎక్కువ రీఓపెన్ అవుతున్నాయని లోతుగా విశ్లేషణ జరుగుతున్నందున అధికారులు ఫిర్యాదుల పరిష్కారంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. రీఓపెన్ లో రెవెన్యూ రికార్డ్స్, భూ తగాదాలకు సంబంధించి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీస్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని, వీటిపై పోలీసు, రెవెన్యూ అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు..
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే దరఖాస్తులపై సిఎంఓ కార్యాలయం నుంచి పర్యవేక్షణ చేస్తున్నారని, అందువల్ల ఎప్పటికప్పుడు దరఖాస్తులను చూడడంతో పాటు గడువు లోపు, రీఓపెన్ కాకుండా పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలో కర్నూలు అర్బన్, ఆదోని రూరల్, దేవనకొండ , గోనెగండ్ల, కల్లూరు మండలాల్లో అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని, ఆయా మండలాల తహశీల్దార్లు ఫిర్యాదుల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, డిఆర్ఓ చిరంజీవి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక