ఆంధ్రప్రదేశ్
పల్లె పండుగలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టండి

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
14 నుండి పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు.
ప్రారంభోత్సవాలకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించండి.
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణీయా.
ఈనెల 14 నుండి 20 తేది వరకు వారం రోజులపాటు నిర్వహించే పల్లె పండుగ కార్యక్రమంలో నిర్దేశించిన అభివృద్ధి పనులను శ్రీకారం చుట్టేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పంచాయతీరాజ్, డ్వామా అధికారులను ఆదేశించారు.
మంగళవారం రాష్ట్ర సచివాలయం నుండి పల్లె పండుగ కార్యక్రమం నిర్వహణపై ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, తాగునీటి సరఫరా, గ్రామీణాభివృద్ధి, అడవులు, సైన్స్ & టెక్నాలజీ, పర్యావరణ శాఖా మంత్రి పవన్ కళ్యాణ్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, డ్వామా పీడీ జనార్దన్ రావు, పంచాయతీరాజ్ ఎస్ఈ నాగరాజు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మనోహర్, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ఈనెల 14వ తేదీ నుండి 20 తేది వరకు నిర్వహించే పల్లె పండుగ కార్యక్రమంలో దాదాపు 90 కోట్ల రూపాయలతో మంజూరు చేసిన 1024 పనులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నామని డిప్యూటీ సీఎంకు వివరించారు. ఉపాధి హామీ పథక నిధుల అనుసంధానంతో చేపట్టనున్న సిసి రోడ్లు, డ్రైన్లు, బిటి రోడ్లు తదితర పనులకు ప్రారంభోత్సవాలకు స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పరిపాలన ఉత్తర్వులు మంజూరు చేసిన 1026 పనులకు వారం రోజుల వ్యవధిలో శంకుస్థాపనలు చేసి పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వివరించారు.
అంతకుముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈనెల 14 నుండి 20 వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో “పల్లెపండగ – పంచాయతీ వారోత్సవాలు” కార్యక్రమంలో నిర్దేశించిన పనులకు పెద్దఎత్తున శంకుస్థాపనలు చేయాలన్నారు. శంకుస్థాపన కోసం గ్రామ పంచాయితీలు, ఎమ్మెల్యేలవారీగా రోజువారీ రూట్ మ్యాప్లను సిద్ధం చేసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయితీల్లో ఒకేరోజు గ్రామసభలు నిర్వహించి వరల్డ్ రికార్డ్ యూనియన్ అవార్డు అందుకున్నామన్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా రూ. 2081 కోట్ల వేతన బకాయిలు జమ చేశామని మంత్రి తెలిపారు. 2024-25 ఏడాదికిగాను రూ.4,500 కోట్ల నిధులతో పనులకు గ్రామ సభల ఆమోదం పొందాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల పనులకు పల్లె పండుగలో శ్రీకారం చుట్టామన్నారు. పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు మంజురైన పనులకు పండుగ వాతావరణంలో భూమిపూజలు నిర్వహించాలన్నారు. ఉపాధి, ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన నిర్మాణాలు సంక్రాంతి పండుగలు పూర్తిచేసి ప్రారంభోత్సవాలు జరుపుకోవాలని మంత్రి కలెక్టర్లను సూచించారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక