ఆంధ్రప్రదేశ్
విద్యుత్ చార్జీల భారాన్ని ప్రజలపై వేసే ఆలోచనను ఉపసంహరించకపోతే మరో విద్యుత్ ఉద్యమాన్ని చేపడతాం.

ఏపీ టుడే న్యూస్ కర్నూలు బ్యూరో
టిడిపి కూటమి ప్రభుత్వం ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో 8114 కోట్ల రూపాయలు విద్యుత్ భారాన్ని ప్రజలపై వేయడాన్ని ఉపసంహరించకపోతే మరో విద్యుత్ ఉద్యమాన్ని చేపడతామని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రంలోని విద్యుత్ కార్యాలయం ముందు విద్యుత్ నియంత్రణ మండలి చేపడుతున్న అభిప్రాయ సేకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలనిసిపిఎం రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగా ఈరోజు కర్నూల్ నగరంలోని బళ్లారి చౌరస్తా లో ఉన్న విద్యుత్ సౌధా కార్యాలయం ముందు సిపిఎం పార్టీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. సిపిఎం న్యూ సిటీ కార్యదర్శి టి రాముడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో రాకముందు వైసిపి ప్రభుత్వం వేసిన విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా బాదుడే బాదుడు అనే కార్యక్రమాన్ని చేపట్టిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ అదే భారాన్ని ప్రజలపై వేయడం దుర్మార్గమైన చర్య అని ఆయన ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు నాయుడు యొక్క ద్వంద వైఖరికి ఇది నిదర్శనం అని ఆయన తెలిపారు. విద్యుత్ సంస్థను మూడు ముక్కలుగా చేసి ప్రపంచ బ్యాక్ షరతులను అమలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. గతంలో ఉన్న స్లాబ్ సిస్టం కూడా మార్చి కొత్త స్లాబ్ రేటును అమలు చేసి ప్రజలు విద్యుత్తు వాడకపోయినా భారం పడేలా చేశాడని ఆయన తెలిపారు. 2022 – 23 సంవత్సరంలో ప్రజలు వాడిన విద్యుత్ పై ట్రూ అప్ చార్జీల పేరుతో 8 వేల కోట్లకు పైగా భారాలు వేయడం సరైన పద్ధతి కాదని ఆయన విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ నియంత్రణ మండలి ఆన్లైన్లో తూతూ మంత్రంగా ప్రజాభిప్రాయ సేకరణ చేసి విద్యుత్ భారాన్ని ప్రజలపై వేయడానికి మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు. భారాలు వేసినప్పుడల్లా ఇదే తంతు ప్రదర్శించడం సరైన పద్ధతి కాదని తెలిపారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడడం ఆయన ద్వంద వైఖరికి నిదర్శనమని ఆయన తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన ఆలోచనను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తర్వాత సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి నిర్మల గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మోసకారి అని ప్రజలను మోసం చేయడమే ఆయన పని అని ఆమె విమర్శించారు. చంద్రబాబు నాయుడుకు ధైర్యం ఉంటే ఎన్నికల ముందు ఈ విషయాన్ని చెప్పి ఓట్లు అడిగి ఉండాలని ఆమె విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన తంతును ఆపి విద్యుత్ భారాలు ప్రజలపై వేయకుండా నివారించాలని విద్యుత్ సంస్థపై పడిన 8 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వమే భరించాలని ఆమె డిమాండ్ చేశారు అనంతరం టెక్నికల్ డిఈ గారికి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం తన ఆలోచనలను ఉపసంహరించకపోతే మరో విద్యుత్ ఉద్యమాన్ని చేపడతామని ఆయన హెచ్చరించారు. సిపిఎం జిల్లా నాయకులు పిఎస్ రాధాకృష్ణ, ఆనంద్ బాబు, సుబాన్, సాయిబాబా సుధాకర్ అప్ప నరసింహ, షరీఫ్ అబ్దుల్లా రామకృష్ణ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక