Uncategorized
రక్తదానం చేద్దాం…ప్రజల ప్రాణాలు కాపాడుకుందాం…

యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్)
నాగేంద్రుడు
ఏపి టుడే న్యూస్ కర్నూలు బ్యూరో
ప్రతిఒక్కరు రక్తదానం పట్ల అవగాహనా పెంచుకోవాలని, అత్యవసర సమయాల్లో రక్తదానం చేయడం వల్ల ఎన్నో ప్రాణాలు కాపాడుకోవచ్చు అని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) రాష్ట్ర నాయకులు నీలం సత్యనారాయణ, కర్నూలు నగర కార్యదర్శి మునిస్వామిలు అన్నారు.బుధవారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో వాయిస్ ఆఫ్ ఇండియా స్టాఫ్ రిపోర్టర్ జె. నాగరాజు సతీమణి జె.లక్ష్మిదేవికి యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం నాయకులు, మన తెలుగు దినపత్రిక,విఎస్ 9 టీవీ కర్నూలు ప్రతినిధి వి.విజయ్ కుమార్ రక్తదానం చేశారు.ఈ సందర్బంగా నీలం సత్యనారాయణ, మునిస్వామిలు మాట్లాడారు.జె.లక్ష్మీదేవి అనారోగ్యంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతుంది.ఈ నేపథ్యంలో సమాచారం తెలుసుకున్న విజయ్ కుమార్ ఆమెకు రక్తదానం చేయడం అభినందనీయం అన్నారు. అత్యవసర సమయాల్లో ప్రతి ఒక్కరికి రక్తం అవసరం ఏర్పడుతుందని అన్నారు.మానవత్వంతో వారికి రక్తం ఇవ్వడం వల్ల వారి ప్రాణాలను కాపాడుకోగలిగిన వారమవుతాం అని చెప్పారు.రక్తదానం పట్ల ప్రజలకు ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం రక్తదాత విజయ్ కుమార్ ను అభినందించారు.విజయ్ కుమార్ మాట్లాడుతూ తాను ఇప్పటికే సుమారు 10సార్లు రక్తదానం చేశానని తెలిపారు.రక్తదానం చేసిన సందర్బంలో బాధితుల కళ్ళలో సంతోషం నాకు ఆశీర్వాదాలుగా భావిస్తానని చెప్పారు. రక్తం ఇవ్వడం వల్ల ఎలాంటి నష్టం కలగదని,కొద్దిరోజులోనే మన శరీరంలోకి కొత్త రక్తం ఏర్పడుతుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ శ్రీనివాసులు,జె.నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక