ఆంధ్రప్రదేశ్
గిరిజన ఉపాధ్యాయుడు రాజు నాయక్ పై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్న డిఈఓపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి

“గిరిజన ఉపాధ్యాయుడు రాజు నాయక్ పై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్న డిఈఓపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి. ”
” మంత్రి దగ్గర మెప్పుకోసం లాలూచీ పడుతున్న డీఈఓ ను సస్పెండ్ చేయాలి.”
“మంత్రి దగ్గర మె ప్పుకోసం ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి గిరిజన ఉపాధ్యాయుడిని వేధింపులకు గురి చేస్తున్న డీఈఓ జనార్దన్ రెడ్డి తగిన మూల్యం చెల్లించక తప్పదు”.
సిపిఐ జిల్లా సమితి డిమాండ్.
నంద్యాల జిల్లా నంద్యాల బ్యూరో ఏపీ టుడే న్యూస్.
బనగానపల్లె పట్టణంలో విధులు నిర్వహిస్తున్న గిరిజన ఉపాధ్యాయుడి ని ఉద్దేశపూర్వకంగా వేధిస్తూ అవమానపరుస్తూ సస్పెన్షన్ గడువు పూర్తయిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విధులకు హాజరుకావాలని అనుమతించిన నంద్యాల డీఈవో జనార్దన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు చేపడుతూ మంత్రి దగ్గర మెప్పుకోసం రాజు నాయక్ ను వారి కుటుంబాన్ని వేధిస్తున్న నంద్యాల డీఈవో ఎస్ సి ఎస్ టి అట్రాసిటీ కింద కేసు నమోదు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్. బాబా ఫకృద్దీన్ ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య జిల్లా కార్యదర్శి మోట.రాముడు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సూర్య ప్రతాప్ లు డిమాండ్ చేసారు.
సిపిఐ జిల్లా కార్యాలయం నందు విలేకరుల సమావేశంలో
సిపిఐ జిల్లా కార్యదర్శిఎన్.రంగనాయుడు మాట్లాడుతూ
బనగానపల్లె మండలం బనగానపల్లె బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు తెలుగు ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న కే. రాజు నాయక్ ను అసంబద్ధ ఆరోపణలతో విధుల నుండి సస్పెన్షన్ చేయడం జరిగింది. అయితే నిబంధన ప్రకారం ఆరు నెలలకు మించి సస్పెన్షన్ గడువు పెంచరాదు అన్న నిబంధనలో ఉన్న, నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి రాజకీయ నాయకుల అడుగులకు -మడుగులు వత్తుతూ రాజు నాయక్ పై కక్ష సాధింపుచర్యలకు దిగడం సమంజసం కాదన్నారు. డి ఈ ఓ రాజకీయాలు చేయాలి అనుకుంటే తన ఉద్యోగానికి రాజీనామా చేసి తనకు నచ్చిన పార్టీ కండువా వేసుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ ఒక ప్రభుత్వ అధికారిగా ఉంటూ సాటి ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలకు పూనుకుంటే,గతంలో పనిచేసిన కడప డీఈవో రాఘవరెడ్డి కి, రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ప్రతాప్ రెడ్డి కి,మువ్వ రామలింగం కి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.
ఇప్పటికైనా రాజు నాయక్ సస్పెన్షన్ ఎత్తివేయకుంటే డిఇఓ జనార్దన్ రెడ్డి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంద ని హెచ్చరిస్తూ, ఇదే విషయంపై ఇప్పటికే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే. రామకృష్ణ రాష్ట్ర ముఖ్యమంత్రి ని, విద్యా శాఖ మంత్రి ని, ఆర్థిక శాఖ మంత్రులను కలిసి గత ప్రభుత్వంలో అధికారులు అనుసరిస్తున్న విధానాలే ఈ ప్రభుత్వంలోకూడా అధికారులు అనుసరిస్తున్నారని చెప్పడానికి నంద్యాల జిల్లా డిఈఓ జనార్ధన రెడ్డి చేస్తున్న చర్యలే నిదర్శనమని తగు ఆధారాలతో వారి దృష్టికి తీసుకొని వెళ్లడానికి గత రెండు రోజులుగా ప్రయత్నం జరుగుతున్నదని అన్నారు . సస్పెండ్ అయిన ఉపాధ్యాయులకు నిబంధనలను బట్టి నిలిపేసిన జీతాభత్యాలు రెండు రోజులు ఆలస్యమైనా తిరిగి పొందగలడు , కానీ సస్పెన్షన్ కాలంలో పాఠాలు నష్టపోయిన విద్యార్థులకు జరిగిన నష్టాన్ని డీఈవో జనార్దన్ రెడ్డి బాధ్యత వహిస్తారా ? భావి భారత పౌరులకు పాఠ్యాంశాలు బోధించకుండా సస్పెన్షన్ బూచితో ఉపాధ్యాయులను బోధనకు దూరంగా ఉంచడం మంచిది కాదని అన్నారు . సుప్రీం కోర్టు తీర్పులను కూడా ఈయన గమనించక పోవడం దురదృష్టం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే నంద్యాల డిఈఓ జనార్దన్ రెడ్డి ఉపాధ్యాయుడు రాజు నాయక్ ను విధుల్లోకి తీసుకోవాలని లేనిపక్షంలో సిపిఐ, విద్యార్థి ప్రజా సంఘాలు ఆయనకు అండగా నిలబడి పోరాడుతామని సిపిఐ నాయకులు తెలిపారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక