ఆంధ్రప్రదేశ్
పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి కొత్తపేట డిఎస్పీ సుంకర మురళీ మోహన్

*సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి
*ఈతకోట గ్రామంలోని జెడ్పి పాఠశాలలో అవగాహన సదస్సు లో ముఖ్య అతిథులుగా డిఎస్పీ సుంకర మురళీ మోహన్, టౌన్ సిఐ. ఎమ్.శేఖర్ బాబు.
ఏపీ టుడే న్యూస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి రావులపాలెం (మార్చి 23) పిల్లల పట్ల తల్లీ తండ్రులు శ్రద్ధ వహించి కంటికి రెప్పలా జాగ్రత్తలు తీసుకోవాలని కొత్తపేట డిఎస్పీ సుంకర మురళీ మోహన్ అన్నారు.
మండలం పరిధిలోని ఈతకోట గ్రామంలో గురువారం నాడు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో రావులపాలెం పోలీస్ వారి ఈతకోట గ్రామ పంచాయతీ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు, విద్యార్థుల తల్లీ తండ్రులకు పలు విషయాలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు
ఈ యొక్క సదస్సుకు కొత్తపేట డిఎస్పీ సుంకర మురళీ మోహన్ ముఖ్య అతిధిగా విచ్చేసి విద్యార్థులకు తల్లీ తండ్రులకు అవగాహనా కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు ఫోన్ యాప్లు ఇన్ స్ట్రాగ్రామ్ ఆన్ లైన్లో మోసాలు చేస్తున్న అజ్ఞానవ్యక్తుల వలలో పడకండన్నారు
ఇదే పనిగా కొంతమంది వ్యక్తులు అమాయక ప్రజలను మభ్య పెట్టి మోసానికి పాల్పడుతున్నారన్నారు మద్యం గంజాయి మత్తుకు బానిసలవున్నారని ఇటువంటి వ్యక్తులపై అప్రమత్తంగా ఉండి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు పిల్లలు బయటకు వెళ్లి ఏంచేస్తున్నారో తల్లీ తండ్రులు చూసుకుంటూ ఉండాలని కోరారు సెల్ ఫోన్లు చెడు మార్గానికి కాకుండా మంచికి వినియోగించుకోవాలన్నారు విద్యార్థులు అటు మీ జీవితాలు బాగుండాలని కోరుకునే తల్లీ తండ్రుల మాటలను ఇటు భవిష్యత్తు తీర్చిదిద్దే ఉపాధ్యాయల మాటలను గౌరవించాలన్నారు
ఆన్ లైన్ గంజాయి క్రికెట్ బెట్టింగ్ ర్యాగింగ్ జూదం నేరాలు వంటి వాటికి దూరంగా ఉండాలని అవగాహనా కల్పించారు అటువంటి వాటికీ ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు మీ పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించిన ర్యాగింగ్ చేసిన వెంటనే పోలీసులకు సమాచారం అందజేయలన్నారు యువత భవిష్యత్తును నాశనం చేసుకోకుండా డ్రగ్స్ గంజాయిలాంటి వ్యసనాలకుబానిస కాకుండా దూరంగా ఉండాలన్నారు .
చిన్న వయసులో వారికి మోటార్ బైకులు ఇవ్వరాదన్నారు బండ్ల మీద ప్రయాణించేటప్పుడు ప్రతీ ఒక్కరు హెల్మెట్ ధరించి ప్రయాణించాలన్నారు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే పలు ప్రమాదాలు జరుగుతున్నారన్నారు చూస్తుండగానే కుటుంబలో వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం చిన్నభిన్నమైయ్యిపోయి చాలా నష్టపోయిన కుటుంబాలను సందర్భాలను కళ్ల ముందర చూస్తున్నాంమని దీనిపై అవగాహన పెంచుకుని నడుచుకోవాలన్నారు
ఈ కార్యక్రమంలో రావులపాలెం టౌన్ సిఐ. ఎమ్.శేఖర్ బాబు.ఎస్సై.యన్ రాము. గ్రామ పంచాయతీ కార్యదర్శి మాడుగుల సుందర రామలక్ష్మణ శర్మ. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.వి కృష్ణారెడ్డి.పాఠశాల చైర్మన్ పిప్పర రమేష్. గ్రామ పెద్దలు. మహిళలు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక