ఆంధ్రప్రదేశ్
కర్షకుడి పట్ల కనికరం ఏది – నీటి కోసం రోడ్డు ఎక్కిన రైతన్నలు

నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం ఏపీ టుడే న్యూస్
పంట చేతికొచ్చే దశలో ఉంది. వరి పైరు ప్రస్తుతం వెన్ను విరిచే దశలో ఉంది. మరో 15 రోజుల వరకు పొలంలో నీరు ఉంటే కానీ గట్టెక్కని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో వారం రోజుల నుండి తెలుగుగంగ కాలువకు నీటి సరఫరా నిలిచిపోయింది. మా పరిస్థితి ఏమిటి? మాకు దిక్కెవ్వరు అంటూ అన్నదాత లు అలమటించిపోతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు రోడ్డు పైకి వచ్చారు. ఉగాది పండుగ రోజు కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది పచ్చడి పిడికెడు మెతుకులు తిని హాయిగా గడపాల్సింది పోయి పొలాలకు నీళ్లు వదలండి బాబు అంటూ అన్నదాతలు ఆదివారం బండి ఆత్మకూరు బస్టాండ్ లో రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టారు. తెలుగు గంగ మూడో బ్లాకు కింద రామాపురం బండి ఆత్మకూరు సింగవరం గ్రామాలకు చెందిన రైతులు వందలాది ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. ప్రస్తుతం కాలువలకు నీటి సరఫరా నిలిచిపోవడంతో వరి పొట్ట కంకి దశలో ఉండగా సాగునీరు అందకపోతే వేలాది ఎకరాలు వరి ఎండిపోయి ఆర్థికంగా రైతులు వేదాలు నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పొలాలను నీరు అందక పోలమంతా బీటలు వారి నీటి కోసం ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఉందని రైతులు వాపోతున్నారు. రైతుల రాస్తారోకో కార్యక్రమానికి సిపిఎం పార్టీ నాయకులు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు జత కలిశారు. వారబందీ లేకుండా ఏప్రిల్ చివరి వరకు ఆయకట్టు పొలాలకు నీరు అందించాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైతుల ఆందోళన దృష్టిలో ఉంచుకొని తెలుగు గంగ అధికారులు సత్వరమే నీటి విడుదలను చేసి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కొద్దిసేపు సిపిఎం నాయకులు రైతులు బస్టాండులో రాస్తారోకో కార్యక్రమం చేపట్టడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కార్యక్రమంలో సిపిఎం పార్టీకి చెందిన నాయకులు రత్నమయ్య డేవిడ్ రాజు, సుబ్బరాయుడు,రైతులు ఎల్లయ్య, వాసుదేవరెడ్డి జగన్, ఆచారి, శ్రీను, గుర్రప్ప బాలసుంకన్నలు, ప్రజా సంఘాల నాయకులు రామచంద్రుడు, ఏసోబు చంద్రబాబు, రైతు సంఘం నాయకుడు వెంకటేశ్వర్లు నాగరత్నం రామాపురం గ్రామాల రైతులతో పాటు వివిధ గ్రామాల రైతులు ఆందోళనలో పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక