ఆంధ్రప్రదేశ్
ప్రశ్నిస్తే చంపేస్తారా

విలేకరులపై దాడి హేయమైన చర్య
విలేకరులకు రక్షణ కరువు
విలేకరులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
జర్నలిస్ట్ మిత్రులందరికీ UJF యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం అండ
నాగేంద్రుడు
ఏపి టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
గత కొద్దిరోజుల క్రితం జరిగిన పల్లె సాక్షి పత్రిక విలేఖరి భీమలింగడుపై దాడి చేసిన ఎర్రమట్టి మాఫియా పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు ఉదయం 11:30 గంటలకు కల్లూరు MRO కార్యాలయంలో విలేకరుల సంఘం UJయునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం లోని దేవనకొండ మండలం కరిడికొండ గ్రామకొండ ప్రాంతాల్లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఎర్రమట్టి తరలిస్తున్న సమాచారం తెలుసుకొని ఎర్రమట్టి మాఫియాను ప్రశ్నించి అడ్డుకోవడానికి వెళ్లిన పల్లె సాక్షి పత్రిక విలేఖరి భీమలింగడుపై ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా భయభ్రాంతులను గురి చేసేలా ఎర్ర మట్టి మాఫియా జెసిబి యజమాని అయినా కన్నప్ప విలేకరిపై పిడుగుద్దులతో ఇనుపరాడులతో పదునైన ఆయుధాలతో హత్య చేయడానికి కుట్రకు పాల్పడ్డారు. ప్రభుత్వ మరియు ప్రజల ఆస్తులను అక్రమంగా దోపిడీ చేస్తున్న వారి అక్రమాలను తమ పత్రిక ద్వారా ప్రభుత్వానికి ప్రజల్లో తీసుకువెళ్లడానికి చైతన్యపరిచిన మల్ల సాక్షి పత్రిక భీమలింగడుపై అత్యాయత్నం చేసిన మట్టి మాఫియా దుండగులపై ప్రభుత్వం తక్షణమే పూర్తి విచారణ జరిపించి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని తమరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేయగలరని UJF యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం మండల కమిటీ ఆధ్వర్యంలో కోరడమైనది విలేకరులపై నిత్యం ఎక్కడో ఒకచోట దాడులు జరుగుతున్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. సమాజంలో జరిగే వాస్తవాలను నిజానిజాలను ప్రజలకు చేరవేసే మీడియా పత్రిక విలేకరులకు రక్షణ లేకుండా పోయింది. ప్రభుత్వాలు ఇప్పుడైనా గుర్తించి చట్టపరంగా మీడియా మిత్రులపై దాడులు చేసే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని తెలియజేయడమైనది. విలేకరులపై దాడి సమయంలో ప్రతి ఒక్క జర్నలిస్టు మిత్రులందరికీ అండగా నిలబడి బాధిత జర్నలిస్ట్ మిత్రులందరికీ న్యాయం జరిగే వరకు పోరాడతామని ఇలాంటి దాడులు పునరావృత్తం కాకుండా విలేకరులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరడమైనది లేని పక్షంలో మండల జిల్లా రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించి జర్నలిస్ట్ అంటే ఏమిటో ఈ ప్రభుత్వానికి తెలియజేస్తాం అని యూజెఏఫ్ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో యూజెఎఫ్ మండల కమిటీ అధ్యక్షులు జి మధుసూదన ఉపాధ్యక్షులు వైవి రెడ్డి ప్రధాన కార్యదర్శి లోకేష్ వజ్రరాజు చంద్రశేఖర్ జిల్లా యుజెఎఫ్ కమిటీ నాయకులు లీలం సత్యనారాయణ వి విజయకుమార్ మరియు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక