Connect with us

Uncategorized

పద్మశాలీయ అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ప్రతిభ అవార్డులు మెరిట్స్ స్కాలర్షిప్

Published

on

పద్మశాలీయ అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ప్రతిభ అవార్డులు మెరిట్స్ స్కాలర్షిప్

వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు

పద్మశాలీయ అభ్యుదయ సంఘం ప్రొద్దుటూరు వారి ఆధ్వర్యంలో ప్రతిభ గల పద్మశాలీయ విద్యార్థిని విద్యార్థులకు 27వ ప్రతిభ అవార్డుల మెరిట్ స్కాలర్షిప్ ప్రధాన ఉత్సవ ఈనెల 25వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు పద్మశాలియ కళ్యాణ మండపము నందు నిర్వహించనున్నట్లు సంఘ పెద్దలు మంగళవారం ఉదయం ప్రొద్దుటూరు స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 26 సంవత్సరములుగా ప్రొద్దుటూరులోని పద్మశాలీయ విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించవలెను అన్న ఆశయముతో ప్రతిభా అవార్డుల కార్యక్రమం నందు మెరిట్ స్కాలర్షిప్పులను అందజేయనున్నట్లు, ఇందులో భాగంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో అత్యధిక మార్పులు సాధించిన ఎంపీసీ, బైపిసి, ఎంఈసి, సిఇసి గ్రూపుల విద్యార్థిని విద్యార్థులకు ప్రథమ బహుమతిగా ఐదు వేల రూపాయలు, అలాగే ద్వితీయ బహుమతిగా 4వేల రూపాయలు మొమెంటు ప్రశంసా పత్రములు అందజేయనున్నట్లు, అలాగే ఇంటర్ ద్వితీయ సంవత్సరములో 900 మార్కులకు ఆ పైన సాధించిన విద్యార్థిని విద్యార్థులకు కన్సోలేషన్ బహుమతి కింద మూడు వేల రూపాయల నగదు బహుమతి, మోమెంటు, ప్రశంసా పత్రాలు అందజేయనున్నట్లు. 10వ తరగతి నందు అత్యధిక మార్పులు సాధించిన ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు ప్రథమ బహుమతిగా 4000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 3000 రూపాయల నగదు పారితోషకము అలాగే మూమెంట్, ప్రశంసా పత్రం అందజేసి, పదవ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదివి 450 మార్కులకు ఆపైన సాధించిన విద్యార్థిని విద్యార్థులకు కన్సోలేషన్ బహుమతి కింద 3000 నగదు మొమెంటు, ప్రశంసా పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఎంసెట్, నీట్, ఐఐటీ జేఈఈ మెయిన్స్ నందు అత్యుత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు 5000 రూపాయల నగదు ప్రోత్సాహక బహుమతి మోమెంటు ప్రశంసా పత్రం అందజేసి. పదవ తరగతిలో టౌన్ ఫస్ట్ అత్యధిక మార్కులు సాధించిన పద్మశాలి ఇతర కులస్తులైన విద్యార్థినీ విద్యార్థులకు 4000 రూపాయల నగదు బహుమతి, మోమెంటు ప్రశంసా పత్రము, ప్రతిభా అవార్డుల ప్రధానోత్సవ సభలో ప్రముఖుల చేత అందజేయడం జరుగుతుందని, కావున పైన కనపరిచిన అన్ని గ్రూపుల పద్మశాలియ విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు స్పందించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెంటనే తమ వివరాలు మే 17వ తేదీ నాటికి అందచేయవలసిందిగా కోరారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580145
Total Users : 47829