Connect with us

ఆంధ్రప్రదేశ్

నంద్యాల పిజిఆర్ఎస్ కు 187 సమస్యలు.

Published

on

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ నంద్యాల జిల్లా బ్యూరో

ప్రజా విజ్ఞప్తులకు నాణ్యమైన పరిష్కారం చూపండి.
అర్జీలను నిర్ణీత కాల పరిమితి లోపు పరిష్కరించండి.
అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా.

ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం ద్వారా స్వీకరించిన ప్రజా విజ్ఞప్తులను క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సెంటినరీ హాలులో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. డిఆర్వో ఎ. పద్మజ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా అధికారులను సూచించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన వినతులపై మరింత ఏకాగ్రతతో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లో పిజిఆర్ఎస్ సిస్టంను పటిష్టం చేశామని, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యానికి తావు లేకుండా వేగవంతంగా పరిష్కరించుకోవాలన్నారు. దరఖాస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్ ఎల్ ఏ లోకి వెళ్లకుండా చూడటంతో పాటు రీఓపెన్ కాకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు.

పిజిఆర్ఎస్ లో కొన్ని సమస్యలు.

1)శిరివెళ్ల మండలం గోవిందపల్లే గ్రామానికి చెందిన ఇందిరమ్మ తన కుమార్తె ఆశాభినీ కామినేనిపల్లే గ్రామానికి చెందిన రాజశేఖర్ ఈ నెల 4 వ తేదీన ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో కిడ్నాప్ చేసి ఎత్తకెళ్ళాడని, అదే రోజు పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చిన ఎలాంటి ఫలితం లేదని, ఇప్పటివరకు తన కుమార్తె అతని దగ్గరే ఉన్నది అతనిపై కిడ్నాప్ కేసు పెట్టి తన కూతురును అప్పగించాలంటూ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు ను సమర్పించుకున్నారు.
2) నంద్యాల మండలం బ్రాహ్మణపల్లి గ్రామ వాస్తవ్యురాలు చెన్నమ్మ తన భర్త పేరు మీద గ్రామ పొలిమేరలో సర్వే నంబర్ 53 లో 1.12 ఏకరాల భూమి ఉందనీ, 2023 లో తన భర్త మరణించారని ఆయన పేరు మీద ఉన్న భూమిని ఆన్లైన్, పాస్పుస్తకాలు మార్చి ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తును సమర్పించుకున్నారు.
3)నందికొట్కూరు మండల వాస్తవ్యురాలు వడ్డెమాను రాణేమ్మ గత 40 సంవత్సరాల నుండి నందికొట్కూరులోని సర్వే నంబర్ 196 లో 3 ఏకరాల భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని, సీపీఎం వారు ఆ పొలంలో ఇప్పుడు జెండాలు పాతారని సంబంధిత భూమికి సంబంధించి డీ – పట్టా మంజూరు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తును సమర్పించుకున్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో 187 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వితిన్ ఎస్ఎల్ఏ లోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580371
Total Users : 48055