ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర వ్యాప్తంగా నంద్యాల ఆర్యవైశ్యులు కు మంచి పేరు తెచ్చింది భవనాశి కుటుంభమే.

సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
నంద్యాల ప్రజల ప్రేమ,ఆప్యాయత,ఆశీర్వాదాలతో పదవులు వచ్చాయి.
నంద్యాలకు మరింత పేరు తీసుకొస్తాం.
నంద్యాల ఆర్యవైశ్య కుటుంబంలో” మల్టీ స్టార్స్” భవనాశి సోదరులు.
నంద్యాల ప్రజలు మాపై ఉన్న ప్రేమ,ఆప్యాయత,ఆశీర్వాదాలతోనే ఇద్దరికీ మంచి పదవులు వచ్చాయని నంద్యాల ప్రజల రుణం తీర్చు కోలేమని నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రథమ అధ్యక్షులు భవనాశి నాగ మహేష్,కాశీ అన్నపూర్ణ సముదాయాలు,నంద్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు భవనాశి శ్రీనివాసులు( వాసు) లు పేర్కొన్నారు.ఆదివారం రాత్రి జయంత వెజ్ వరల్డ్ లో మామిడి నాగరాజు అధ్యక్షతన శ్రీనివాస నగర్,పద్మావతి నగర్, సంజీవనగర్ శ్రీ వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో భవనాశి సోదరులను ఘనంగా సన్మానించారు.మొదట జ్యోతిప్రజ్వలన చేసి ఆర్యవైశ్యుల కులదైవం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి చిత్ర పటానికి పూలమాలలు వేశారు.ఈ సందర్భంగా భవనాశి సోదరులు మాట్లాడుతూ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తూ వారి సేవా మార్గంలోనే నడుస్తున్నామని అన్నారు.నంద్యాల ప్రజలు మా సోదరులపై చూపిస్తున్న ప్రేమ,ఆప్యాయత,ఆశీర్వాడలతోనే ఉన్నత పదవులు వచ్చాయని అన్నారు.నంద్యాల ప్రజలు రుణం టెర్చుకోవాలంటే ఏమిచ్చినా తీర్చు కోలేమన్నారు. కాశీ అన్నసాత్రం సముదాయాల అధ్యక్షులుగా ఏకగ్రీవం కావడానికి టీజీవెంకటేష్,టీజీ భరత్,మరి కొందరు సహకారంతోనే ఈ పదవి లభించిందని అన్నారు.రాష్ట్రం నలుమూలలా ఎందరో దాతలు ఉన్నారని,వారి సహకారం మరువలేనిదని,దాతలు దేవుళ్ళతో సమానమని అభివర్ణించారు.వారణాశి,తిరుపతి,షిరిడీ,హరిద్వార్,హైదరాబాద్ ప్రాంతాల్లో కాశీ అన్నపూర్ణ వాసవి సత్రాలు ఉన్నాయని అన్నారు.కాశీ అన్నపూర్ణ సత్రం 1999 లో ప్రారంభించారని ఎందరో మహానుభావులు విరాళాలు ఇచ్చి అంచెలంచెలుగా అభివృద్ధి చేశారన్నారు.శ్రీశైలంలో 84 రూములతో కాశీ అన్నాసత్రం ఏర్పాటుకు భూమి పూజ జరిగిందని అన్నారు.వారణాశిలో 100 గదులతో మరో సంత్రం ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.అరుణాచలంలో సైతం కాశీ అన్నపూర్ణ వాసవి సత్రం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని అన్నారు.నంద్యాల ప్రజలకు మేము చేసిన సేవ చాల తక్కువని పెద్దలు ఎందరో కోట్లు విలువచేసే స్థలాలు విరాళాలు ఇచ్చారని వారందరికీ పాదాభివందనం చేస్తున్నామని అన్నారు.వక్తలు మాట్లాడుతూ భవనాశి శ్రీరామ మూర్తి ఉమ్మడి జిల్లాలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా పని చేసే టైం లో జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు తిరిగి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయాలు కట్టించడానికి కృషిచేసారని అన్నారు.రాష్ట్రంలో అన్ని దేవాలయాలకు ఆర్థికంగా ఎదుకొనేవారు ఆర్యవైశ్యులు అని గుర్తుచేశారు.నంద్యాల ఆర్యవైశ్య సోదరుల్లో మల్టీ స్టార్స్ ఎవరంటే భవనాశి సోదరులే అని చెప్పక తప్పదన్నారు.వేప, రావి చెట్టు కలిస్తే అశ్వర్త నారాయణ వృక్షం అని ఎలా పిలుస్తా మో ,సమాజానికి సేవచేసే ఇలాంటి సోదరులను అశ్వర్థ నారాయణ వృక్షం లాంటి వారని కొనియాడారు.న్యాయకత్వ పటిమలు అధికంగా ఉండడంతో సాటి మనిషికి ఉపయోగపడతారని అన్నారు.భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని పేర్కొన్నారు.అనంతరం ప్రముఖులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక