ఆంధ్రప్రదేశ్
పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి- మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ

పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి- మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
పత్తికొండ పాటు నియోజకవర్గ పరిధిలోని మద్దికెర,తుగ్గలి, వెల్దుర్తి,కృష్ణగిరి మండలాలలోని పలు గ్రామాలలో అధిక వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ ప్రభుత్వాన్ని కోరారు.గురువారం ఆమె తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. మిరప,టమోటా,ఉల్లి,సజ్జ, వేరుశనగ,పత్తి పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే ఎకరాకు రూ.20 వేలు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా చేతికందే పరిస్థితి లేదని రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. పంటనష్ట నివారణ అంచనా వేసి ప్రతి రైతుకు పరిహారన్ని అందేలా తక్షణమే చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో పత్తికొండ ఎంపీపీ నారాయణదాసు,మండల కన్వీనర్ కారం నాగరాజు, వైఎస్ఆర్ పార్టీ జిల్లా నాయకులు బాబుల్ రెడ్డి, శ్రీరంగడు,జూటూరు జయచంద్రా రెడ్డి, చిన్నహుల్తి, పెద్దహుల్తి, చక్రాల,రాంపల్లి శభాష్ పురం గ్రామాల సర్పంచులు కేశవరెడ్డి, నాగరాజు, శ్రీరాములు, మణీంద్ర, రవి, తుగ్గలి మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు రాంపల్లి నాగభూషణ్ రెడ్డి, పెండేకల్ గోపాల్ రెడ్డి,రాతన ఉమామహేశ్వర్ రెడ్డి, లంకాయపల్లి హనుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక