ఆంధ్రప్రదేశ్
అమరావతి అభివృద్ధికి శ్రీ మఠం తోడ్పాటు… 50 లక్షల చెక్కును అందజేసిన శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామీజీ

ఏపీ టుడే న్యూస్,కర్నూలు జిల్లా/మంత్రాలయం రిపోర్టర్:
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామీజీ దివ్యమైన, స్వామివారికి పవిత్రమైన గురువారం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి శ్రీ మఠం 50 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చి తోడ్పాటు అందించింది. ఈ బృహత్తర కార్యక్రమం మంత్రాలయం పీఠాధిపతి శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామీజీ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకి విజయవాడలోని ఆయన నివాసం నందు 50 లక్షల రూపాయల చెక్కును అందజేయడం జరిగింది. మరియు శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం తరఫున స్వామి వారి శేష వస్త్రం, జ్ఞాపిక, ఫల ,మంత్ర, అక్షింతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మరియు తనయుడు రాష్ట్ర ఐటి ,విద్య శాఖ మాత్యులు లోకేష్ కు అందజేసి పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామి వారి దివ్య ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే డి వెంకటకృష్ణారెడ్డి, బిజెపి రాష్ట్ర మీడియా ఇంచార్జి పి.నాగభూషణం, శ్రీ మఠం అధికారులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక